2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న చిరంజీవిపై టిడిపి నాయకులు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ నేతలు ఎంత హేయమైన అవాకులు చవాకులు పేలారో అందరికీ తెలిసిందే.. ఎవడికి పడితే వాడికి గెలుపు సాధ్యం కాదని, పార్టీ పెట్టిన ప్రతోడు ముఖ్యమంత్రి కాలేడని, అలా అవ్వాలంటే ఖచ్చితంగా వాడు కమ్మోడై ఉండాలని ఇలా అనేక రకాల వ్యంగ్యాస్త్రాలు కాపు సామాజిక వర్గంపై సంధించారు. ఒక దశలో కమ్మ సామాజిక వర్గం పెట్టుకున్నటువంటి ఒక సభలో కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి ముఖ్యమంత్రిగా. గెలవాలి అంటే కమ్మ రక్తం ఎక్కించుకోవాలి అని మాట్లాడారు.
అనంతరం మరొక సందర్భంలో బాలకృష్ణ సైతం హేయమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. 2014లో టిడిపి అధికారంలో ఉండగా నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని ఆహ్వానించారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం గా ఎవరిని పడితే వాడిని నా పక్కన కూర్చోబెట్టుకోను దానికి ఒక స్థాయి, అర్హత ఉండాలి అన్నాడు. మా నాన్న లాగా ఆరు నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోదామని చిరంజీవి కలలు కన్నాడు అధికారం మా జాతి లక్షణం, వాళ్ళేంత అంటూ అవమానకరంగా మాట్లాడాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వెనకాల తిరిగే వాళ్లంతా అలాగా జనం వాళ్ళ బురదజాతి అంటూ వ్యాఖ్యలు చేశాడు.
అయితే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలన్నీ కూడా 2014లో జనసేనతో పొత్తు పెట్టుకుని టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం గమనార్హం. 2019లో టీడీపీ అత్యంత ఘోరమైన ఓటమి చవిచూసిన తర్వాత మళ్లీ జనసేనతో పొత్తు కోసం వెంపర్లాడటం టిడిపికి చంద్రబాబుకి తప్పలేదు. ఈ నేపథ్యంలో గెలుపు కావాలంటే కమ్మరక్తం ఎక్కించుకోవాలని చెప్పిన మీకు మీ కమ్మరక్తం పని చేయలేదా బాబూ అని కాపులు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. 2019 ఘోరమైన ఓటమి తర్వాత కమ్మరక్తం మురిగిగిపోయి గెలుపు కోసం ఇప్పుడు కాపురక్తం ఎక్కించుకున్నావా చంద్రబాబు అంటూ నేరుగా అడుగుతున్నారు.. చంద్రబాబు ఇంట్లో ఒంట్లో ఉన్న కమ్మరక్తం చెడిపోయిందా అని కొందరు మెగా అభిమానులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.