ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్ధులను ప్రకటించిన తరువాత ముఖ్యంగా టీడీపీ నుంచి వలసల ప్రవాహం పెరుగుతున్నాయి.నేడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సమక్షంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు, ఇతర ముఖ్య నేతలు వైసీపీ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు మాట్లాడుతూ కష్ట కాలంలో టీడీపీ కోసం ఆర్థికంగా అండగా వుండి కష్ట పడి పనిచేస్తే చివరకు చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకున్నారు అంటూ చంద్రబాబు నాయుడుని చీదరించుకుంటూ తెలుగుదేశం పార్టీనీ వీడుతున్నము అని ప్రకటించారు.
మొన్నటివరకు కళ్యాణదుర్గంకు ఉమామహేశ్వర్ నాయుడు, హనుమతరాయ చౌదరి లను ఇంచార్జ్ లుగా వుంచిన చంద్రబాబు ఎలక్షన్ వరకు ప్రతి కార్యక్రమంకు ఖర్చు పెట్టించి పార్టీ కార్యక్రమాలు అప్పజెప్పి చివరకు డబ్బులు ఎక్కువగా వున్నాయి అని పార్టీకి కోట్ల రూపాయలు ఫండ్ తీసుకొని బడా కాంట్రాక్టర్ అయిన సురేంద్రబాబు కు టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు. దీనితో ఆరోజు నుండి సురేంద్రబాబుకు నియోజకవర్గ పరిధిలో ఉమామహేశ్వర్ నాయుడు, హనుమంతరాయ చౌదరి వర్గంకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలూ చెలరేగాయి. ఎప్పటినుండో పార్టీ కోసం పని చేసిన నాయకులు తమకు అన్యాయం జరిగింది అని అవేదన పడుతుంటే చంద్రబాబు నాయుడు కనీసం వీరిని పిలిచి మాట్లాడింది లేదు.
ఇదే టైం లో ఉమామహేశ్వర్ నాయుడు, హనుమతరాయ చౌదరిలను పిలవకుండా కళ్యాణదుర్గంలో సురేంద్రబాబు ర్యాలీ నిర్వహించారు, అక్కడ జరిగిన ఫ్లెక్సీ గొడవలు చినికి చినికి గాలివాన గా మారి టీడీపీలోని గ్రూప్ ల మధ్య గొడవలను తీవ్ర స్థాయికి చేరాయి , అవి ఈరోజుతో బద్దలు అయ్యి ఉమామహేశ్వర్ నాయుడు, ఇతర నియోజకవర్గ కీలక నేతలు టీడీపీ కి రాజీనామా చేసి వైసీపీ లోకి సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయ్యారు. దీనితో కళ్యాణదుర్గంలో టీడీపీ చెల్లాచెదురు అయిపోయింది. చంద్రబాబు నాయుడు కోట్లలో డబ్బుల తీసుకోని పార్టీ నాయకులను మోసం చేస్తున్నాడు. దీనితో ముఖ్య కార్యకర్తలు, నాయకులు మొత్తం ప్రత్యర్ధి పార్టీలలోకి వెళ్లిపోతున్నారు అని సురేంద్రబాబు లబోదిబో మని మొత్తుకుంటున్నారు.