2009 ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం ప్రచారం చేసి, ఆ ప్రచారంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాల మీదకు తెచ్చుకుని హాస్పిటల్ బెడ్ మీద నుండి కూడా టీడీపీకి ప్రచారం చేశాడు జూనియర్ ఎన్టీఆర్ . టీడీపీ ఆ ఎన్నికల్లో ఓడిపోగా, జూనియర్ ప్రచారం చేసిన ప్రతీ నియోజక వర్గంలో టీడీపీ ఓడిపోయిందని ఈనాడు చేత రాయించడం, పార్టీ నుండి దూరం పెట్టడం, తన తండ్రిని అవమానించడం వంటి చర్యలతో టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చాడు
నిజానికి జూ.ఎన్టీఆర్ తన చిన్నప్పుడే బాబు ను వెన్నుపోటుదారుగా గుర్తించాడు, బాబుకి ఓటెయ్యొద్దని ప్రచారమూ చేశాడు.. 1999 సెప్టెంబర్ 15 న హరికృష్ణ అధ్యక్షునిగా ఉన్న అన్న టీడీపీ తరపున గుంటూరు జిల్లా యడ్లపాడు లో ప్రచారం లో భాగంగా అప్పుడు మాస్టర్ (బాలుడు) గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు వెన్నుపోటు పొడిచిన బాబుకు బుద్ధిచెప్పాలని, ఎన్టీఆర్ విధించిన మద్యానిషేదానికి తూట్లు పొడిచిన బాబు టీడీపీకి ఓటు వెయ్యొద్దని ప్రచారం చేశాడు..
2009 ఎన్నికలలో బాబు రాయబారాలకి కరిగిపోయి ప్రచారం చేసినా ఆ తర్వాత తన పై బాబు చేసిన కుట్రలు ప్రత్యక్ష్యంగా రుచి చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కూడా బాబుకు ఓటెయ్యొద్దని బయటికి చెప్పలేకపోయినా తన ఆంతరంగీకులతో తన అభిప్రాయాన్ని మాత్రం వెల్లడిస్తున్నాడని సమాచారం…