పవన్ కళ్యాణ్ మొదటి నుంచి సైనికులను మోసం చేస్తూనే వచ్చాడు. పార్టీ పెట్టింది మొదలు ఈరోజు వరకు ఏ కార్యక్రమం కూడా చెప్పింది చెప్పినట్టుగా చేసిన పరిస్థితి లేదు. తను ప్రకటించే షెడ్యూల్ ప్రకారం ఏ ప్రోగ్రాం ను నడిపించిన పరిస్థితి లేదు. తాజాగా పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అని కట్టించిన పవన్ కళ్యాణ్, స్థానిక తెలుగుదేశం పార్టీ కీలక నేత మాజీ టిడిపి ఎమ్మెల్యే వర్మ తో మొదట్లో కాస్త విభేదాలు వచ్చినప్పటికీ అనేక చర్చల అనంతరం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేనలో సీటు దక్కించుకున్నాడు.
ఎట్టకేలకు ముహూర్తం చూసుకొని ప్రచారం పేరుతో పిఠాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టాడు పవన్ కళ్యాణ్. అయితే అక్కడ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారం మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్.. కానీ ఆ ప్రచారాన్ని ఒక రోజుకు మించి చేయలేకపోయాడు. ఒక్కరోజు ప్రచారానికే అలసిపోయి సొలసిపోయిన పవన్ కళ్యాణ్ ఆరోగ్యం దెబ్బతిందని, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని ఆ ఒక్కరోజు ప్రచారంతోనే పలాయనం చిత్తగించాడు. మరుసటి రోజు తెనాలిలో జరగాల్సిన ప్రచారాన్ని కూడా అనారోగ్యం కారణంతో వాయిదా వేశాడు. దీంతో తెల్ల మొహాలు వేయటం జనసైనికుల వంతయింది. తమ నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కి అడుగడుగున నీరాజనాలు పట్టాలి అని వేయి కళ్లతో ఎదురుచూసిన జనసైనికులకు నిరాశే మిగిలింది.
అయితే అనారోగ్యం కారణంగా ప్రచారం చేయలేకపోతున్నాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాను విశ్రాంతి అవసరమని తన పార్టీ అధికారిక లెటర్ హెడ్ మీద నోటీస్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పరారైన మరుసటి రోజు అకస్మాత్తుగా హైదరాబాద్ షూటింగ్లో ప్రత్యక్షమయ్యాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన జనసైనికులు పార్టీ కంటే ఎన్నికల ప్రచారం కంటే షూటింగ్లు ముఖ్యమా అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ యాజమాన్యానికి సూటిగానే ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి పార్ట్ టైం రాజకీయాల కోసం అయితే పూర్తిగా సినిమాల్లోనే ఉంటే సరిపోతుంది కదా మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను నన్ను గెలిపించండి అని అర్థించడంలో అర్థం ఏముంది అని పెదవి విరుస్తున్నారు.