కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బిజెపి తమ అభ్యర్థులను ప్రకటించి ఎలక్షన్ కదన రంగంలోకి దిగాయి. ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా టీడీపీ జనసేన తమ అభ్యర్ధుల తరుపున ప్రచారం చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా రెండు రోజులపాటు నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. అందులో ఈరోజు సాయంత్రం తణుకు నియోజవర్గంలో టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ తరుపున ప్రచారం చేయనున్నారు అటూ నుండి నిడుదవోలు లో జనసేన అభ్యర్థి కందుల దుర్గేశ్ తరుపున బహిరంగసభలో పాల్గొననున్నారు. రేపు పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు హైదరాబాదు నుండి బయలుదేరి తణుకు పాలిటెక్నిక్ కళాశాలకు హెలికాప్టర్ లో చేరుకొని రోడ్డు మార్గాన తణుకులోని నరేంద్ర మోడి సెంటర్ కు చేరుకుని టీడీపీ అభ్యర్థి అయిన రాధాకృష్ణ తరుపున అటు నుండి రోడ్డు మార్గంలో నిడదవోలు కు యాత్రగా వెళ్ళి గణేష్ చౌక్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అభ్యర్ధి కందుల దుర్గేశ్ , ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి తరుపున ప్రచారం చేయనున్నారు. రేపు మొదట పి గన్నవరంలో జనసేన అభ్యర్ధి గిడ్డి సత్యనారాయణ తరుపున, అమలాపురంలో టీడీపీ అభ్యర్ధి ఆనందరావు తరుపున బహిరంగ సభలో ప్రచారం చేయనున్నారు.
ఇప్పటికే తణుకు జన సేన నాయకులు తమకు పోటి చేసే అవకాశం ఇవ్వలేదు అని సగం మంది పార్టీకీ రాజీనామా చేశారు, నిడదవోలు లో టీడీపీ కార్యకర్తలు వేల మంది ర్యాలీ తీసీ జన సేన కు సపోర్ట్ చేసేది లేదు అని తెగేసి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తణుకులో అదే సెంటర్ లో గత నాలుగు నెలల క్రితమే జన సేన తరుపున టికెట్ అంటూ విడువాడ కు ప్రకటించారు ఇప్పుడు అదే సీటు టీడీపీ కి ఇచ్చి విడివాడ ను మరొకసారి మోసం చేసి ప్రజలకు ఏమి సమాధానం చెబుతారో చూడాలి. ఆయా నియోజకవర్గాల్లో ఉమ్మడిగా రెండు పార్టీల నాయకులకు , కార్యకర్తలకు ఏమని సమాధానం చెప్తారో అలాగే ప్రజలకు ఏమని చెప్పి ప్రచారం చేస్తారో చూడాలి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎలెక్షన్ సమయంలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదారాబాద్ లోనే నివాసం వుంటున్నారు. ఇంకొకటి బిజెపి నాయకులకు సంబంధం లేకుండా కేవలం జనసేన, టీడీపీ ఉమ్మడి సభలుగా ప్రకటించడం గమనార్హం.