తెలుగుదేశం జనసేన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉమ్మడిగా నిర్వహిస్తున్న తాడేపల్లిగూడెం సభ జనం లేక తుస్సుమంది. లక్షలాది మంది వస్తారని ఆశించి ఏర్పాట్లు చేసుకుంటే చివరికి కార్యకర్తలే నాయకుల ఆశలపై నీళ్ళు చల్లారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ , చంద్రబాబు ఇద్దరూ సభా వేధిక దగ్గరికి చేరుకున్నా ప్రజలు కనిపించకపోయే సరికి వారి రాక కోసం ఎదురు చూడటం ఇద్దరి వంతైంది.
ఎన్నో ఆశలు పెట్టుకుని ఉమ్మడిగా నిర్వహించిన ఈ సభ ఇంత దారుణంగా విఫలం చెందటానికి ప్రధాన కారణం ఇరు పార్టీ నేతలు కలిసి ఉమ్మడిగా ప్రకటించిన సీట్లు జాబితానే అని అక్కడ వారు మాట్లాడుకోవడం గమనార్హం. మరీ ముఖ్యంగా జనసేన పార్టీకి చంద్రబాబు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడం .. చివరికి ఆ 24 సీట్లలో కూడా 2019లో కాస్తో కూస్తో ఓట్ బ్యాంక్ తెచ్చుకున్న నియోజకవర్గాలు లేకపోవడంతో జనసేన కార్యకర్తలు ఆ పార్టి అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో తాము తెలుగుదేశం అభ్యర్ధులకి సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. అలాగే పీ గన్నవరం లాంటి స్థానాల్లో రాజేష్, లాంటి వారికి ఇవ్వడం . తెలుగుదేశంలో సీనియర్లు గా చలామణి అయ్యే నాయకుల జాతకం ఇంకా సస్పెన్స్ లో పెట్టడం లాంటి పరిణామాల ఎఫెక్ట్ ఈ సభపై పడి ఇరు వర్గాలు కాడి కింద పడెయ్యటంతో చివరికి సభలో ప్రజలే కరువయ్యారనే వాదన ఉంది . ఇది ముమ్మటికి నాయకుల తప్పే అని రెండు పార్టీల కార్యకర్తలు వ్యాఖ్యణించడం విశేషం .