జనసైనికులకు అవమానాలు అవహేళనలే అడుగడుగునా అలంకారాలుగా మారాయి. అయ్యాయి. ఎన్నో ఏళ్లుగా గౌరవం కోసం ఎదురుచూపులే తప్ప దక్కిన సందర్భం ఒకటి లేదు. సమాజంలో తమ్ముకుంటూ ఒక గుర్తింపును తెచ్చే అడుగులు పవన్ కళ్యాణ్ ఒక్కటంటే ఒక్కటి కూడా వేయలేదు. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అంటూ పవన్ కళ్యాణ్ వెనక పడిగాపులు పడుతూ వచ్చారు జనసైనికులు. కానీ పవన్ కళ్యాణ్ కి తన ప్యాకేజీ రాజకీయలే తప్ప పరువు ప్రతిష్టలతో ఏమాత్రం సంబంధం లేదు అని మరోసారి రుజువైంది.
టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేనకి కేటాయించింది కేవలం 21 సీట్లుమాత్రమే… అయితే ఆ 21 సీట్లలో కూడా ఎంతమంది జనసేన జెండాపై డైరెక్ట్ గా పోటీ చేస్తున్నారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని అయోమయ పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే జనసేన ప్రకటించిన సీట్లలో దాదాపు పది మందికి పైగా టిడిపి నుంచి వచ్చిన వాళ్లే… తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు డిసైడ్ చేసి పంపించిన వాళ్లే… అందులో ఈరోజు అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రకటన జరిగింది.దీనితో తలలు బాదుకోవడం జన సైనికులకు పరిపాటిగా మారింది.
ఇలా అయితే గత 10 ఏళ్లుగా 175 నియోజకవర్గాల్లో జనసేన కోసం గుడ్డలు చించుకుని.. ఒళ్లు హూనం చేసుకుని.. చేతిచమురు వదిలించుకున్న మనం ఏమైపోవాలని, పదేళ్ల నుండి ‘‘బాబు జెండా మోయడమే మన ఎజెండాగా మారిందా?’’ అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జన సైనికులు లోలోన మదనపడుతున్నారు. ఇచ్చింది 21 స్థానాల్లో కూడా మెజారిటీ స్థానాలు టీడీపీకే కేటాయించే పని అయితే మొత్తం టిడిపి జెండా మీదే పోటీ చేస్తే సరిపోతుంది కదా పొత్తు పేరుతో మళ్ళి వెర్రోళ్ళని చేయటం ఎందుకు అని కుమిలిపోతున్నారు. నాడు పిఠాపురంలో వర్మ పేకాట క్లబ్బులు నడిపేవాడని విమర్శించిన నోటితోనే… నేడు మన పవన్ కి “నా గెలుపు నీ చేతిలోనే ఉంది వర్మా”… అని కాళ్లు పట్టుకొని బతిమాలుకునే కర్మ పట్టిందా అని వాపోతున్నారు.