పొత్తు పేరుతో జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే 21 సీట్లు మాత్రమే తీసుకొని జన సేన నాయకులను , కార్యకర్తలను మోసం చేశారు అని భాద పడుతున్న జన సైనికులను పవన్ కళ్యాణ్ తన చేష్టలతో మరింత బాధ పెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే పిఠాపురంలో ప్రచారానికి వచ్చిన జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఎక్కువగా టీడీపీ నాయకుల మీద ఆధారపడి జన సేన పార్టీ కోసం గత పది సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న జన సైనికులను పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ తీరు చూసిన జన సైనికులు మాకు ఇదేమి ఖర్మ పట్టింది అంటూ టీడీపీ వాళ్ళకు లభించిన కనీస గౌరవం మాకు దక్కడం లేదు అని వాపోతున్నారు.
పిఠాపురంలో వార్డు కమిటీలు వేస్తున్నాం వార్డుకు ఇద్దరు చొప్పున అని జన సైనికులను పవన్ కళ్యాణ్ బస చేస్తున్న హోటల్ కి రమ్మని కబురు పంపారు. తీరా జన సైనికులు వచ్చాక ఇప్పుడు కాదు అని మంచి ఎండలో రెండు గంటలు పైగా ఎదురు చూపుల తర్వాత అందులో మహిళలు వున్నారన్న కనీస గౌరవం లేకుండా పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ తో కనీసం మీటింగ్ రద్ధు చేశారు అనే విషయం కూడా చెప్పకుండా బయటకు తోసేశారు. అదే టైంలో టీడీపీ నాయకుడు వర్మ తన కార్యకర్తలతో వస్తే వెంటనే గేట్ లు ఓపెన్ చేసి లోపలకి పంపారు. దీనితో జనసైనికులు ఇంకొంత బాధ పడి పవన్ కళ్యాణ్ కోసం పది సంవత్సరాలుగా ర్యాలీలు తీసాము, పవన్ కళ్యాణ్ మీటింగ్ లు అంటే జనాలను తీసుకువచ్చాము, ఈరోజు టీడీపీ నాయకులు ఎక్కువ అయ్యారు మాకంటే అంటూ జన సేన అధినేత మీద లోకల్ ఇంచార్జ్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు.
జన సేన పార్టీ పిఠాపురం లోకాల్ వాట్సాప్ గ్రూప్ లో తమ బాధ ను గోడును వెళ్ళబుచ్చుకుంటున్నరు . నన్ను పవన్ కళ్యాణ్ వెధవని చేసాడు, రోషం వున్న ప్రతి కార్యకర్తను అవమానపరిచాడు బయట నుండి ఎవడేవడో వస్తున్నాడు అందరికి బానిసలుగా బతకలేము అంటూ గగ్గోలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం లోకల్ టీడీపీ నాయకుల తోనే తిరుగుతూ గెలుపు ప్రచార భాధ్యత లు టీడీపీ నాయకులకే అప్పజెప్పి జన సైనికులను కనీసం పట్టించుకోవడం లేదు విలువ ఇవ్వడం లేదు. ఇంకొన్ని రోజులు ఇలానే కొనసాగితే జన సైనికులు జన సేన పార్టీకి పవన్ కళ్యాణ్ కు దూరం జరిగి పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి.