ఊర్రూతలూగించే ప్రచారాంశాలు మార్చి 16 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించునున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రచారం మొదలు పెట్టాలి అని తలపించి ఈరోజు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు,నాయకులతో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో సమావేశం అయ్యారు. ప్రతి రోజు మూడు నియోజకవర్గాలలో ప్రచారం చేపట్టాలని పార్టీ కేంద్ర కార్యాలయం నిర్ణయించింది. 26 జిల్లాలలో సభలు ఉండే విధంగా పార్టీ కేంద్ర కార్యాలయం కసరత్తు నిర్వహిస్తోంది.ఇప్పటికే సిద్ధం సభలలో ఫుల్ జోష్ మీద ఉన్న క్యాడర్ కు మరింత ఉత్సహ పరిచే విషయం ఇది.
రేపు బాపట్ల జిల్లా మేదరమెట్ల దగ్గర జరగనున్న సిద్ధం ఆఖరి సభ కాగా అందులో మేనిఫెస్టో విడుదల చేస్తారు అని సమాచారం. కాగా 2019 లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 98 శాతం అమలు చేసి వైసీపీ మేనిఫెస్టో అంటే నమ్మకానికి మారుపేరు అనే విశ్వసనీయత సంపాదించుకొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల కోసం రేపు సిద్ధం సభలో విడుదల చేయబోయే మేనిఫెస్టో కోసం రాష్ట్రం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తుంది అనటంలో సందేహం లేదు.
మేనిఫెస్టో విడుదల తర్వాత ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్న నేపథ్యంలో మేనిఫెస్టో లో పెట్టే ప్రతి అంశాన్ని జగన్ స్వయంగా ప్రజలోకి తీసుకునే వెళ్ళే అవకాశం ఉంది. బిజెపి,టిడిపి, జనసేన కూటమిలో ఇంకా పొత్తులు విషయం సీట్లు విషయాలలో ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ అందరు అభ్యర్థులను సిద్ధం చేసుకుని ఎన్నికల యుద్ధంలో ముందడుగు వేస్తున్నారు.