జగనన్న విద్యా దీవెన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ “ఈ రోజు పామర్రుకు మన దేవుడు వచ్చాడు, చాలా సంతోషంగా ఉంది, నిత్యం ప్రజల్లో ఉండే మన సీఎంగారు ఎక్కడా కూడా కులం, మతం చూడలేదు, ఓటు వేశారా వేయలేదా అని కూడా చూడలేదు, జగనన్నా మా అందరి కోసం తోడేళ్ళన్నీ ఏకమైనా పచ్చ మీడియా విషప్రచారం చేసినా జగనన్న మన కోసం పోరాడుతున్నారు, విద్యా దీవెన కార్యక్రమానికి అన్న పామర్రు రావడం సంతోషకరం, అట్టడుగు వర్గాల వారిని పైకి తీసుకురావాలన్న సంకల్పం గొప్పది, మన జగనన్న వ్యవస్ధలో మార్పులు రావాలంటే విద్య ఉండాలని భావించి అన్ని బాధ్యతలు అన్న తీసుకున్నారు. జూన్, జులై నెల వచ్చిందంటే ప్రతి ఒక్కరూ తమ పిల్లల గురించి ఆలోచిస్తారు కానీ జగనన్న ఆ బాధ్యత తీసుకున్నారు, ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా మీరంతా ఆలోచించి మన, మన పిల్లల భవిష్యత్ బావుండాలంటే జగనన్న ఈ రాష్ట్రానికి 30 ఏళ్ళు సీఎంగా ఉండాలి, ముఠానాయకులను, ప్యాకేజ్ స్టార్లను మీరంతా తరిమికొట్టాలి, ఒక వ్యక్తి ఈ మధ్య తరచూ అత్తగారింటికి నిమ్మకూరు వస్తున్నాడు, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కొత్త కథలు చెబుతున్నాడు, చంద్రబాబు…రాష్ట్రానికి జగన్ గారు 30 ఏళ్ళు సీఎంగా ఉంటారు, మా నియోజకవర్గంలో అందరికీ సంక్షేమ పథకాలు అందించారు, కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారానికి నిధులు ఇవ్వాలని కోరుతున్నాను, జగన్ గారు సామాన్యుడైన నన్ను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేను చేశారు, మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జగనన్నా మీ వెంటే నడుస్తాను అంటూ ముగించారు.