ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాజకీయంగా వేస్తున్న అడుగులని నిశితంగా పరిశీలిస్తే అచ్చం వారి తండ్రిగారైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి అడుగులే గుర్తుకు రాక మానదు. 2003 పాదయాత్ర నుండి 2009 ఎన్నికల వరకు వైయస్సార్ గారు తన పాలన, తన నిర్ణయాలు, మాటలు, గుండె ధైర్యం , ప్రజలపై పెట్టుకున్న అపార నమ్మకం అన్ని కూడా ఇప్పుడు జగన్ గారిలో కనిపిస్తున్నాయి.
వైయస్సార్ గారు 2004లో తన సుదీర్గ పాదయాత్ర ద్వారా ఎలా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారో అచ్చం అదే మాదిరి జగన్ గారు సైతం తన సుదీర్గ పాదయాత్ర ద్వారా ప్రజల మనసులు గెలిచి అధికారంలోకి వచ్చారు. అలాగే వైయస్సార్ గారు ఎలాగైతే అభివృద్దితో పాటు, తన మానస పుత్రికలుగా భావించిన అనేక సంక్షేమ పధకాలు అందిస్తూ పరిపాలన సాగించారో జగన్ గారు సైతం అలాగే అభివృద్దితో పాటు తన మానస పుత్రికలుగా భావించిన అనేక సంక్షేమ పధకాలు పేదలకి అందిస్తూ పాలన సాగించారు.
ఇక 2009 ఎన్నికల సందర్భంలో ఎలాగైతే ప్రతిపక్షాలు అన్ని ఏకమై కూటమిగా జట్టు కట్టి పోటీకి వచ్చిన సంధర్భంలో తాను మాత్రం తన పరిపాలననే నమ్ముకుని ఒంటరిగా బరిలోకి దిగి ప్రజలపై అపారమైన నమ్మకాన్ని పెట్టుకున్నారో , జగన్ గారు సైతం 2024 ఎన్నికల్లో కూటమికి వ్యతిరేకంగా ఒంటరిగా నిలబడి ప్రజలపైనే నమ్మకం పెట్టుకున్నారు . అలాగే వైయస్సార్ గారు తన స్టార్ క్యాంపైనర్లు నా పాలనలో నా ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన 4 కోట్ల మంది లబ్దిదారులే అని ప్రకటించినట్టు గానే జగన్ గారు సైతం తన ప్రభుత్వం నుంచి పథకాలు అందుకుని తమ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపరుచుకున్న ప్రతి పేద మహిళ, ప్రతి చిరుద్యోగి తమ పార్టీకి స్టార్క్యాంపైనర్లే అని ప్రకటించారు.
ఇలా ప్రతీ అడుగులో సీఎం జగన్ గారు తన తండ్రిగారైన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని గారిని గుర్తుకు వచ్చేలా చేస్తున్నారని , 2009లో వైయస్సార్ గారు ఒంటరిగా వెళ్ళి ఏ విధంగా కూటమిని ఓడించి మళ్ళీ సీఏం అయ్యారో జగన్ గారు సైతం 2024 ఎన్నికల్లో కూటమిని ఓడించి మళ్ళీ సీఎం అవ్వడం ఖాయమని , సర్వేలు అన్ని జగన్ గారే సీఎం అని ఇప్పటికే స్పష్టం చేశాయని జగన్ అభిమానుల నుండి వస్తున్న మాట. వైఎస్సార్ గారిని ప్రతి అడుగులో గుర్తుకు వచ్చేలా జగన్ గారు అడుగులు వేస్తు గెలుపు బాటలో దూసుకుపోతున్నారని రాజకీయ విశ్లేషకుల మాట.