చంద్రబాబు ప్రభుత్వం లో దగ పడిన రైతన్న, బాబు మోసపూరిత మాటలు నమ్మి రైతులకి పూర్తి స్థాయి లో రుణమాఫీ చేస్తా అని చెప్పి, నవ్యాంధ్ర కి అనుభవం ఉన్న నాయకుడు కావాలి అని నమ్మబలికి 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత అరకొర రుణమాఫీ చేసి, ఉన్న అయిదేళ్ళు వర్షాలు పడక త్రాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, వాటర్ ట్యాంక్ లతో నీళ్ళుతోలిన పరిస్థితి.కరువు చంద్రబాబు కవల పిల్లలు అనడానికి ఎటువంటి సందేహం లేదు. అలా అన్ని విధాలుగా అల్లాడుతున్న రైతున్నలకి 2019 సార్వత్రిక ఎన్నికలలో మీకు నేను ఉన్న అంటూ భరోసా కల్పిస్తూ అధికారం లోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలలో చెప్పిన విధంగా రైతు భరోసా నీ ఏడాది కి 13500 రూపాయిలు సహాయం అందిస్తూ రైతుల పక్షాన నిలబడింది.
రైతన్న ల అదృష్టం అనాలో ఏమో ఆనాడు దిగంవత నేత వైఎస్సార్ ప్రభుత్వం లో, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఏటా వర్షాలు పడడం , బోరు బావులలో నీళ్ళు ఇంకా కుండా ఉండడం, రైతుల కోసం ప్రతి గ్రామ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రం నిర్మించడం, దాని ద్వారా ఎక్కడి రైతులకి అక్కడే పంట ఎరువులు ఇవ్వడం , పంట పెట్టే రైతులకి సబ్సిడీ ద్వారా వేరుశెనగ కాయలు ఇవ్వడం జరుగుతోంది. రెండు గ్రామాల పరిధిలో ఒక గిడ్డంగి కేంద్ర ఏర్పాటు చేసి పంటును నిల్వ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. దీనితో పాటుగా రైతన్నల కోసం RBK అనే యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసి తద్వారా పంట విధానాలు, చర్చలు , కొత్తగా పంట పెట్టే వారికి ఒక సూచనగా , గైడెన్స్ గా ఈ ఛానల్ ఉపయోగ పడనుంది.
2019 సార్వత్రిక ఎన్నికల సమయం లో చెప్పిన విధంగా ప్రతి ఏడాది 13500 రూపాయిలును రబీ, ఖరీఫ్ సీజన్ పెట్టుబడులు కోసం ఏడాది లో నాలుగు దఫాలు ఈ డబ్బు ను డైరెక్ట్ గా రైతన్నలా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. అధికారం చేపట్టిన నాలుగు సంవత్సరలా తొమ్మిది నెలల కాలం వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 5352905 మంది రైతులు 33299.80 కోట్లు రూపాయిలు లబ్ధి చేకూరింది.ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని జగన్ మోహన్ రెడ్డి నిరూపించాడు.