2019 సార్వత్రిక ఎన్నికలలో అఖండ విజయం సాధించి నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ జగన్ మోహన్ రెడ్డి తరచు చెప్పే మాట ఒకటే, 2019 ఎన్నికలలో మనకు ఓటు వేసిన వేయకపోయినా సరే, మన పార్టీ వాడు అయినా కాకపోయినా సరే వారు ఆ పథకంకు అర్హులా కాదా అనేది మాత్రమే కొలమానంగా తీసుకొని ప్రతి పేదవాడికి పక్క ఇల్లు ఉండాలి అనేది మన నినాదం అన్నారు, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం క్రింద మనం నిర్మించేది ఇళ్లు కాదు ఊర్లు అనేది తరచు చెప్పేవాడు.
అదే నిజం చేస్తూ మన రాష్ట్రంలో దాదాపు 71,811 ఎకరాల్లో 31.20 లక్షల మందికి అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది జగన్ ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రలో అయిదు ఏళ్ల పాలనలో ఇంత మందికి పట్టాలు ఇచ్చిన చరిత్ర లేదు , ఇంతలా పేదలకు ఇళ్ల కోసం మహాయజ్ఞం చేసింది మాత్రం ఒక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే. కొత్తగా కేటాయించిన ఈ 71,811 ఎకరాలు ప్రాంతాన్ని బట్టి ఒకో ప్లాట్ విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా పలుకుతున్న నేపథ్యంలో
ఆ కనీస విలువ రూ.2.5 లక్షల చొప్పున లెక్కించినా ఇళ్ల పట్టాల విలువ రూ.76 వేల కోట్ల పైన ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించింది ఈ ప్రభుత్వం, అంటే కొత్తగా 17,005 ఊర్లు ఏర్పడినట్లే. స్థలం మాత్రమే కేటాయించి ఊరుకోలేదు వాటిని లే ఔట్లుగా అభివృద్ధి చేసి వాటికి మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, సీవరేజ్, రోడ్లును డెవలప్ చేసింది జగన్ ప్రభుత్వం.
ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా యూనిట్ కు రూ.1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందిస్తోంది ప్రభుత్వం, ఈ నిధులు సరిపోని వారికి పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం అందించే ఏర్పాట్లు ప్రభుత్వమే చేస్తోంది. దీంతో పాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని అతి తక్కువ ధరకే అందించడంతో మరో రూ. 40 వేల మేర లబ్ధి చేకూరనుంది. మొత్తంగా ఒక్కో లబ్ధిదారునికి రూ. 2.70 లక్షల మేర లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వం.మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ. 1 లక్ష లబ్ధి చేకూరుతుంది. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఆ ఇంటి విలువ రూపేణా కనీసం రూ.6 లక్షల నుండి రూ.20 లక్షల వరకు ఆస్తిని ప్రభుత్వం అందిస్తోంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో కనీసం రూ.2 లక్షల కోట్ల నుండి రూ. 3 లక్షల కోట్ల సంపద అందించింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.
దాదాపు 60 వేలకోట్లతో 22 లక్షల ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టుంది ప్రభుత్వం, ఇప్పటికే 8.9 లక్షల ఇళ్ళు గృహప్రవేశాలు కూడా జరిగిపోయాయి . మరో 10 లక్షల ఇల్లు గృహ ప్రవేశాలు చేసుకోవడానికి సిద్ధం గా ఉన్నాయి, మిగిలినవి కూడా నిర్మాణ స్థాయిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
రికార్డు స్థాయిలో 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అందించడమే గాక దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరు మీదనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం.గతంలో ప్రభుత్వాలు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఆ స్థలం పైన పేద వాడికి పూర్తి హక్కు ఉండేది కాదు. డి – పట్టాలు కావడం తో అనుభవించడం మినహా వాటి పైన సర్వ హక్కులు ఎప్పటికి లభించేవి కావు . దానితో ఉండటానికి మినహా వేరే అవసరాలు కోసం వినయోగించకోవడం కోసం కుదిరేది కాదు .
కానీ జగన్ ప్రభుత్వం ఇళ్లు పట్టాలు పొందిన లబ్ధిదారులకు పది ఏళ్లు తర్వాత సర్వ హక్కులు ఉండేలా అసైన్డ్ భూములు చట్టాన్ని సవరించింది.పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) పంపిణీ చేస్తోంది ప్రభుత్వం .పది సంవత్సరాల తర్వాత ఇంటి పైన ఋణాలు, ఆటోమేటిక్ గా సేల్ డీడ్ లాగా మారుతాయి, అనగా ఆ స్థలాలును హక్కుదారుడు కావాలి అంటే అమ్ముకోవచ్చు, ఇతర ప్రయోజనాలు కోసం వినియోగించుకోవచ్చు. . అప్పుడు రెవెన్యూ శాఖ ఎన్ఓసీ అవసరం లేకుండానే పేదలు వాటిని నిరభ్యంతరంగా అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ అయిన నాటి నుంచి వాటిపై ప్రైవేటు భూముల మాదిరిగానే రుణాలు, ఇతర సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు 15 లక్షల ఇంటి రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయి.
గత నాలుగేళ్లలో ఈ స్థలాలును పేదలకు పంపిణీ చేయకూడదని టీడీపీ పార్టీ చంద్రబాబు అధర్యం లో కోర్ట్ లో ఎన్నో పిటిషన్ లు వేసింది, కానీ ఈ ప్రభుత్వం అన్నిటినీ సవాళ్లును ఎదురుకొని అన్ని అడ్డంకులు తొలిగించుకొని అని సజావుగా సాగేలా చూసుకుంది. టీడీపీ ప్రభుత్వం లో చూసాం మనం మనకి ఇంటి పట్టా లేదా సొంత స్థలం లో ఇళ్లు నిర్మించదలిస్తే జన్మభూమి కమిటీ దగ్గరకు వెళ్ళి వాళ్లకు డబ్బిచ్చి, ప్రాదేయపడుకొని తెచ్చుకునే పరిస్థితి. కానీ జగన్ ప్రభుత్వం లో అలా కాకుండా, మనం ఎలిజిబుల్ అయితే చాలా నీ ఇంటి దగ్గర కే వచ్చి సచివయల వ్యవస్థ ద్వారా నీ దగ్గరికే వచ్చి ఇచ్చే పరిస్థితి.
కాగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.180 కోట్లతో కొత్తగా కొన్న భూమిలో 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం భూ బదిలీ పత్రం, కట్టుకోడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి, ఆ పత్రాలు కూడా పంపిణీ సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుంది . దీంతోపాటు ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఆ పేద అక్కచెల్లెమ్మల పేరు మీదుగానే సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్ కూడా చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించే కార్యక్రమాన్ని నేడు ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించనున్నారు.