2019 సార్వత్రిక ఎన్నికలలో అఖండ విజయం సాధించి నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ జగన్ మోహన్ రెడ్డి తరచు చెప్పే మాట ఒకటే, 2019 ఎన్నికలలో మనకు ఓటు వేసిన వేయకపోయినా సరే, మన పార్టీ వాడు అయినా కాకపోయినా సరే వారు ఆ పథకంకు అర్హులా కాదా అనేది మాత్రమే కొలమానంగా తీసుకొని ప్రతి పేదవాడికి పక్క ఇల్లు ఉండాలి అనేది మన నినాదం అన్నారు, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం క్రింద మనం నిర్మించేది […]
జగన్ ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా పేదల సొంతింటి కలను నిజం చేస్తూనే వారికివ్వబోయే స్థలాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించి ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇప్పటికే 31.19 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు అందించిన ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎన్ అగ్రహారంలో కన్వేయన్స్ డీడ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలను అందిస్తున్నాయి. […]
వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని నిరుపేదలకు గూడు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టారు. ఇందులో భాగంగా 30,76,018 మంది మహిళలకు ఉచితంగా పట్టాలిచ్చారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లను చేస్తున్న ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్లు పంపిణీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈనెల 2వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే ఏడు లక్షలకుపైగా […]
పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా పేద మహిళలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల స్థలాలను ఇచ్చారు. కేటాయించిన వారి పేరు మీద ఈనెల 2వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కన్వేయన్స్ డీడ్లు ఇస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం శుక్రవారం నాటికి 6 లక్షల రిజిస్ట్రేషన్లు దాటాయి. 65 శాతానికి […]
– మరో 2.32 లక్షల ఇళ్లకు అనుమతి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు రాష్ట్రంలోని వైఎస్సార్, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. డిసెంబర్ నెలలో మెగా కంప్లీషన్ డ్రైవ్ నిర్వహించి 2.25 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేశారు. మరోవైపు కొత్తగా 2.35 లక్షల ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు వివరాలను గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ […]
ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాల పునర్విభనలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీసత్యసాయి జిల్లాను పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేసింది. నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల ద్వారా జిల్లాలో ఇప్పటి దాకా 8500 కోట్ల రూపాయల సాయం అందిందని వెల్లడించారు . విద్య, వైద్యం, వ్యవసాయం, సున్న వడ్డీ పథకం, వైఎస్ఆర్ బీమ, ఆరోగ్య శ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష, […]
సొంతింటి కల సాకారం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు ఇళ్ల స్థలాలు అందజేశారు. తాజాగా లబ్ధిదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఆ భూమిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయనుంది. రాష్ట్రం మొత్తంగా 31.19 లక్షల మందికి పట్టాలిచ్చిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్లకు సంబంధించి శనివారం రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్ నిర్వహించారు. 29వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పూర్తిచేసి అర్హులకు కన్వేనియన్స్ డీడ్స్ ఇవ్వనున్నారు. […]