గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల ప్రజల అభిమానం సంపాదించలేక ఓటమి పాలయిన పవన్ కళ్యాణ్ ఈసారి తన అదృష్టం పిఠాపురం నుండి పరీక్షించుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురాన్నే ఎంచుకోవడానికి కారణం ఆ నియోజక వర్గంలో కాపు ఓట్లు అధికంగా ఉన్నాయనే వాదన బలంగా వినపడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ కి పిఠాపురం కూడా ఏం అంత ఈజీ కాదు అనే వాదన బలపడుతోంది.
కాపు ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నంత మాత్రాన ఆ నియోజకవర్గం కూడా పవన్ కళ్యాణ్ కి అంత ఈజీ కాదనేది అక్కడి సామాజిక వర్గ లెక్కలు చెబుతున్న సత్యం. 2019 నాటికి పిఠాపురం నియోజకవర్గంలో 2,30,093 ఓటర్లు ఉంటే అందులో కాపులు ఉన్నది కేవలం 72,122 మాత్రమే. మిగిలిన 1,57,971 మంది ఇతర కులాల వారు వున్నారు.
వీరిలో ఎస్సీ మాల 29,443 మంది. ఎస్సీ మాదిగ 10,575 మంది. శెట్టిబలిజ 19,133 మత్స్యకారులు 13,473 మంది. చేనేత 36,000 మంది. యాదవ 13,450 మంది. రెడ్డి 10,154 మంది. బ్రాహ్మిన్ 3000 మంది. వైశ్య 6,500 మంది. సగర 5,000 మంది. కొప్పుల వెలము 4,103 మంది. క్షత్రియ 400 మంది. ఎస్టీ 540 మంది. ఇతర బీసీలు 5,200 మంది. ఇతర ఓసీలు 1,000 మంది ఉన్నారు.
ఉన్న కాపు సోదరుల ఓట్లు మొత్తం గంప గుత్తుగా పవన్ కళ్యాణ్ కి పడే పరిస్థితి లేదు. దీనికి కారణం వైసీపీ నుండి పోటీలో ఉన్న వంగా గీత గారు సైతం అదే సామాజిక వర్గానికి చెందినవారే కాకుండా అమెకి గ్రామల్లో పెద్ద సంఖ్యలో బంధు వర్గం ఉంది. అలాగే ఇదే పిఠాపురంపై ఇటీవల వైసీపీలో చేరిన కాపునేత ముద్రగడ పద్మనాభంగారి ప్రభావమూ ఎక్కువే. అయితే పడే ఓట్లలో అధిక శాతం కాపు ఓట్లు పవన్ కళ్యాణ్ కి రావచ్చు రాకపోవచ్చు అనే పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తున్న నేపధ్యంలో. ఇక మిగిలిన సామాజిక వర్గాలు మొత్తం 1,57,971 మంది, కాపు లీడర్ గా మాత్రమే ముద్రపడ్డ పవన్ కళ్యాణ్ కి ఓటు వేయడానికి సిద్దంగా ఉన్నారా అంటే అనుమానమే. నాన్ లోకల్ గా స్థిరత్వం లేని నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ కి వీరు ఓటు వేయడానికి ఒక్క సరైన రీజన్ కూడా పవన్ కళ్యాణ్, జనసేన దగ్గర లేదు.