2024 ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ఈనాడు కాకమ్మ కథలు చంద్రబాబు గ్రాఫిక్స్ లో కట్టిన కోటలు దాటుతున్నాయి. కాపులకు జగన్ దగా అంటూ అర్ధంలేని ఆరోపణలతో వార్తలు వండివారుస్తుంది.వాస్తవానికి.. కాపు సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వంలో 60 నెలల్లో ఇచ్చింది రూ.1 ,340 కోట్లు.. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2019 నుండి సెప్టెంబర్ 15, 2023 నాటికి అంటే 52 నెలల్లో వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా జగన్ ప్రభుత్వం ఇచ్చింది రూ.2 ,029 కోట్లు. జగన్ ప్రభుత్వం 52 నెలల్లో 77 లక్షల మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు డీబీటీ (22,333 కోట్లు) , నాన్డీబీటీ (16,914 కోట్లు )తో కలిపి చేకూర్చిన లబ్ది రూ.39,247 కోట్లు.
నిజానికి కాపులను మోసం చేసింది చంద్రబాబే.. ఎన్నికలకు ముందు కేంద్రప్రభుత్వం అగ్రకుల పేదలకు ఇచ్చిన 10 శాతం EWS రిజర్వేషన్ లో 5 శాతం కాపులకు ఇవ్వడం చెల్లదు అని తెలిసి కూడా బాబు ఇస్తానని చెప్పాడు.పోనీ కాపులకు టీడీపీ ఏమన్నా చేసిందా అంటే అదీలేదు.. కాపులను బాబు అండ్ కో కలిసి అడుగడుగునా కించపరుస్తూ వచ్చారు. కాపు నాయకులపై హత్యా ప్రయత్నాలు కూడా చేసినట్లు తెలుస్తుంది.
కాపుల నాయకుడైన వంగవీటి రంగా హత్య గురించి బాబుకు ముందే తెలుసునని హరిరామ జోగయ్య పుస్తకంలో రాశారు.. అంతేకాదు.. నన్నూ, రంగాను లేపేయాలని చంద్రబాబు చూసాడు.. కానీ నేను తప్పించుకున్నాను అని కన్నా లక్ష్మి నారాయణ స్వయంగా ABN రాధాకృష్ణకు Open Heart with RK లో చెప్పాడు. కాపుల రిజర్వేషన్ కోసం పోరాడిన ముద్రగడ కుటుంబ స్త్రీలను లకారం భాషలో తిట్టించాడు, ముద్రగడ కొడుకును కొట్టించాడు చంద్రబాబు.. చిరంజీవికి మద్దతు ఇవ్వకపోతే రంగాను లేపేసినట్టు నన్నూ లేపేసేవారు అని దాసరి నారాయణ ముద్రగడకు చెప్పారు. దాసరి పెట్టిన ఉదయం పత్రిక రామోజీ ఈనాడు పత్రికకు పోటీ గా ఉందని ఆ పత్రికను తొక్కేసింది కూడా రామోజీనే..
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు ప్రజలను వేధించారు.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కాపులకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. తుని రైలు దహనం కేసులో కాపుల మీద చంద్రబాబు ప్రభుత్వంలో పెట్టిన కేసులను జగన్ ఎత్తైయించారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ఆడియో ఫంక్షన్ కి విజయవాడలో అనుమతి ఇవ్వలేదు .. చివరికి హాయ్ ల్యాండ్ లో పెట్టుకొంటే రాత్రి 9 గంటలకే పూర్తి చేయమని వత్తిడి తెచ్చారు.ఇక బాలకృష్ణ చిరంజీవిని అవమానించిన విధానమైతే అసలు బాగోలేదు.. వివిధ సందర్భాలలో చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ను బాలయ్య కించపరిచాడు. లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలవరా అని బాలయ్యను అడిగితే..
నా పక్కన నిలబడాలంటే ఒక హోదా ఉండాలి ఎవరిని పడితే వారిని పిలవను అని బాలయ్య అన్నాడు.. చిరంజీవి ఒక ఫెయిల్డ్ పొలిటీషియన్ కానీ మేము వేరు మా బ్లడ్ వేరు అన్నాడు బాలయ్య.. మా నాన్న లాగా పార్టీ పెట్టి 6 నెలల్లో సీఎం అయిపోవాలని కలలు కన్నాడు చిరంజీవి కానీ మా నాన్న కాలిగోటికి సరిపోడు. చరిత్ర సృష్టించాలంటే అది ఒక నందమూరి వంశానికే సాధ్యం అని అన్నాడు బాలయ్య..టీడీపీ పార్టీలోని చిన్నచితక నాయకులు సైతం చిరంజీవిని హేళన చేశారు.కమ్మ రక్తం ఎక్కించుకోని ఉంటే చిరంజీవి సీఎం అయ్యేవాడని టీడీపీ కమ్మ మంత్రులు MLA లు పాల్గొన్న కమ్మ సంఘం సమావేశంలో చెప్పారు.
ఈ అవమానాలకు చిరంజీవి స్పందిస్తూ.. ఈనాడు జ్యోతి పత్రికలు నా మీద, ప్రజారాజ్యం పార్టీ మీద కక్ష కట్టి విషం చిమ్మాయని చెప్పాడు.
జనసేన పార్టీ పెట్టిన కొత్తలో పవన్ కళ్యాణ్ ను బాలయ్య అనేకరకాలుగా అవమానించారు.. జనసేన పవన్ కళ్యాణ్ వెనకాల ఉండేది అలగా జనాలు.. సంకర జాతి మనుషులు అన్నాడు బాలయ్య. ఒకానొక సమయంలో టీడీపీ గురించి బాబు గురించి పవన్ స్పందిస్తూ.. నాకు పరిటాల రవి గుండు కొట్టించాడు అనే ప్రచారం చేసింది ఎన్టీఆర్ భవన్ నుంచే మొదలయ్యిందని చెప్పాడు.. అంతేకాకుండా టీడీపీ జనసేన పొత్తులో ఉన్న సమయంలో నాకు ప్యాకేజ్ ఇచ్చారని ప్రచారం చేసింది కూడా మొదట టీడీపీనే అని.. నేను టీడీపీ ని గెలిపిస్తే ఈ సిగ్గు సరం లేని టీడీపీ వాళ్ళు మా అమ్మను తిట్టించారు అంటూ బాధపడ్డారు.
అడుగడుగునా కాపు ప్రముఖులను కాపు జాతిని అవమానించారు బాబు బ్యాచ్..