ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కొన్ని చోట్ల కూటమికి రెబల్ అభ్యర్థులుగా పోటిలో నిలిచి ఉన్నారు. యలమంచిలిలో జనసేన తరపున సుందరపు విజయ్ కుమార్ పోటిలో వున్నారు. విజయ్ కుమార్ మత్స్యకార వర్గానికీ చెందిన పుడిమడక గ్రామ వాసయిన ఎర్రిపల్లి కిరణ్ మీద హత్య యత్నం చెయ్యడంతో పాటు మత్స్యకార వర్గాల మీద దాడులు చేశారు, దీనితో విజయ్ కుమార్ పై రెబల్ అభ్యర్థిగా మత్స్యకార నేత ఎర్రిపల్లి కిరణ్ నామినేషన్ వేశారు. కిరణ్ కు యలమంచిలి మత్స్యకార గ్రామాల ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
ఎర్రిపల్లి కిరణ్ జనసేన నేత తను పార్టీ కోసం పని చేసే విధానం నచ్చి జిల్లా నాయకులు, రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం నేతలు బాగా మెచ్చుకునేవారు. ఇది సహించని సుండరపు విజయ్ కుమార్ మత్స్యకార నేతలు తనకు అడ్డువస్తారాని పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడంతో ఆగకుండా వారి మీద దాడుల చెయ్యడం వంటివి చేసారు. సుందారపు విజయ్ కుమార్ మీద నియోజకవర్గంలో ఎన్నో కేసులు, పేదవారి భూములు కబ్జా ఆరోపణలు, పారిశ్రామిక వర్గాలను బెదిరించి డబ్బులు వసూలు లాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సుందరపు విజయ్ సోదరులు ఒక మహిళ వద్ద 40 లక్షలు తీసుకొని అతి దారుణంగా మోసం చేసిన సంఘటన యలమంచిలిలో సంచలన సృష్టించింది. దీని మీద ఆ మహిళ పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చారు.
ఇప్పుడు మత్స్యకార నేత కిరణ్ మీద దాడితో, పుడిమడక గ్రామ ప్రజలు, మత్స్యకార గ్రామాలు ఏక తాటిపై వచ్చి సుందరపు విజయ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెబుతాము అని ప్రకటించారు. దీనితో ఎన్నికల్లో జనసేన పార్టీకు ఇది భారీ ఎదురు దెబ్బ అని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.