జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం వెనకపడిపోయింది, రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు ఇవ్వడంలేదు, ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు, అంటూ రోజూ చంద్రబాబు చేసే ప్రచారం వట్టిదే అని ఆయనే ఒప్పుకున్నారు. తన పాలన కన్నా జగన్ పాలనలోనే అత్యధికశాతం ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరిందని తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేశారు.
రాష్ట్రంలో వృద్దులకి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందచేసే వాలంటీర్లపై కత్తికట్టి నిమ్మగడ్డ రమేష్ చేత కేసు వేయించి వారిని విధుల నుండి దూరం చేసిన చంద్రబాబు, 66 లక్షల పెన్షన్ దారుల ఆగ్రహానికి గురయ్యారు. తమకి ఇంటికే పెన్షన్ తెచ్చి ఇవ్వాలని జగన్ చేస్తున్న మంచిపనులని ఓర్చుకోలేకే చంద్రబాబు ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఖంగుతిన్న తెలుగుదేశం శ్రేణులు ఎన్నికల వేల జరిగిన ఈ డ్యామేజీని ఎలా పూడ్చుకోవాలో తెలియక తలలు పట్టుకున్న సమయంలో చంద్రబాబే స్వయంగా వాలంటీర్లు లేని పక్షంలో పెన్షన్ పంపిణి 1.26 లక్షల సచివాలయ ఉద్యోగుల చేత చేయించవచ్చు కద అని ఒక సలహా విసిరేసారు.
ఈనాడు రామోజీ రావు, తెలుగుదేశం చంద్రబాబు రోజూ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు అని చెప్పే మాటలు నిన్నటి రోజున వీరు వదిలిన ఈ స్టేట్మెంట్ తో తప్పని తేలిపోయింది. చివరికి వాలంటీర్లు లేని పక్షంలో పెన్షన్ పంపిణీకి చంద్రబాబుకు జగన్ తీసుకుని వచ్చిన సచివాలయ వ్యవస్థ అందులో పనిచేసే ఉద్యోగులే కనిపించారు. దీంతో చంద్రబాబే అయాచితంగా జగన్ ప్రభుత్వంలో భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగుల కల్పన జరిగినట్టు ఒప్పుకోక తప్పలేదు.