ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్లో ఫుల్ జోష్ నెలకొంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనసేన నుంచి ఇన్చార్జిలు, ముఖ్య నేతలు జగన్ను కలిసి జై కొడుతున్నారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాళెం నైట్ స్టే పాయింట్ విశాఖ జిల్లా టీడీపీతోపాటు పలువురు కీలక నేతలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శంకర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కృష్ణకుమార్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు, ఉడా మాజీ డైరెక్టర్ డి.భారతి, టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్, సందీప్, కిరణ్మయి, దాసు తదితరులకు జగన్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
వైఎస్సార్సీపీలోకి నేతలు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. డబ్బు, పదవుల ఆశ చూపుతున్నా ఎవరూ వినడం లేదు. అధిష్టానం నేరుగా మాట్లాడుతున్న ప్రయోజనం ఉండడం లేదు. పొత్తులను ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. గోదావరి జిల్లాల్లోనూ చేరికలు పోటెత్తాయి. జగన్ బస్సు యాత్ర పూర్తయ్యే నాటికి మరికొందరు ముఖ్య నేతలు ఆయనకు జై కొట్టే అవకాశం అధికంగా ఉంది.