చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోయిన అత్తర్ చాంద్ భాషా తనకు రాజకీయ బిక్ష పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కదిరిలో జాయిన్ కానున్నారు.
1998లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మొదలుపెట్టిన చాంద్ బాషా అంచలంచెలుగా ఎదిగే టిడిపి పార్టీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు స్థాయి వరకు ఎదిగాడు. 2009లో టిడిపి తరఫున టికెట్ ఆశించి భంగపడ్డాడు. 2014లో ఎన్నికలకు మూడు నెలలు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు.
2014 లో గెలిచిన చాంద్ భాషా గెలిచిన మూడు సంవత్సరాలకు అప్పటి అధికారంలో ఉన్న టిడిపి పార్టీ ఒత్తిడి, అరాచకాలు భరించలేక ఆ పార్టీలో చేరవలసి వచ్చింది. 2017లో టిడిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నా కూడా అటు అధికార పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కందికుంట వెంకట్ ప్రసాద్ , ఎమ్మెల్యేగా ఉన్న చాంద్ బాషాకు ఎటువంటి గౌరవం దక్కకుండా చేశాడు. 2014లో కందికుంట వెంకటప్రసాద్ పై చాంద్ బాషా విజయం సాధించడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున సిద్ధారెడ్డి టికెట్ కేటాయించడంతో కందికుంటకి టిడిపి తరఫున టికెట్ కేటాయించారు, కదిరి ఎమ్మెల్యేగా ఉన్న చాంద్ బాషాకు చంద్రబాబు టికెట్ విస్మరించాడు.
2019లో కందికుంట వెంకటప్రసాద్ టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. అప్పట్నుంచి నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు మైనార్టీ నాయకుడైన చాంద్ భాషా తో ఖర్చు చేయించి టికెట్ ఇస్తాం అని చెప్పి మోసం చేశారు. చివరికి ఉండవల్లి నివాసం వద్దకు చాంద్ బాషా వర్గం వెళ్లి టికెట్ ఎందుకు కేటాయించలేదు నారా లోకేష్ ని నిలదీయగా వారికి సమాధానం చెప్పకుండా నారా లోకేష్ అక్కడ్నుంచి జారుకున్నాడు. ఇలా ఎనిమిది సంవత్సరాలుగా టిడిపి పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్న అత్తర్ చాంద్ భాషా తనను రాజకీయంగా ఒక స్థాయిలో నిలబెట్టిన వైఎస్ఆర్ సీపీలోకి జాయిన్ కావాలని నిర్ణయించుకుని ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతున్నారు. అత్తర్ చాంద్ బాషా రావడంతో కదిరిలో వైఎస్ఆర్సిపి మరింత బలపడింది అని చెప్పవచ్చు.