2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు మేనిఫెస్టోలపై శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీల కూటమి సూపర్ సిక్స్ అనే పేరుతో ఒక తాత్కాలిక మేనిఫెస్టోను సిద్దం చేసి ప్రచారంలోకి దిగింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ నుంచి మేనిఫెస్టోకి సంభందించి ఒక కీలక ప్రకటన వెలువడింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది అని , చివరి ప్రక్రియగా తుది మెరుగులు దిద్దుతున్నారు అని కీలక సమాచారం అందుతోంది. ఇప్పటికే మేనిఫెస్టోకి సంభందించి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కమిటీ , మేనిఫెస్టోను సిద్దం చేసి తుది మెరుగులు కోసం వైఎస్ఆర్సీపీ అధ్యక్షడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్దకు పంపించారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐప్యాక్ సంస్థ అధినేత రిషిరాజ్ తో మంతనాలు జరిపారు. ఈ పథకాలు ఉంచాలి, ఏ అంశాలు పైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది అని చర్చలు జరిపినట్లు సమాచారం. ఇప్పుడు ఇస్తున్న పథకాలు కొనసాగిస్తూ వాటికి ఇంకా మెరుగులు దిద్ది సంక్షేమ పరంగా ప్రజలకు ఇంకా ఎక్కవ లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు రచించారు.
2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ నవరత్నాలు పేరుతో మేనిఫెస్టోను ప్రకటించింది. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన నవరత్నాల పథకాల పూర్తి స్థాయిలో అమలు పరిచి ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. 2024 ఎన్నికల సంభందించి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను ఇప్పటికే పూర్తి చేసుకొని తుది మెరుగుల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఉంది. అది పూర్తి చేసుకొని ఉగాది రోజున ప్రకటిస్తారు అని సమాచారం. మేనిఫెస్టోలో భాగంగా నాడు నేడు కింద ఇప్పటికే స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్నాయి వీటికి తోడుగా మరి కొన్ని విభాగాలు ఇందులోకి చేర్చుతున్నట్లు సమాచారం. పట్టణంలో ఉండే యువతి యువకులు ఉపాధి అవకాశాలు కోసం స్థానికంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో అందించే అక్కడే ఉపాధి అవకాశాలు పని చేసే విధంగా రూపకల్పనలు చేస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్న పథకాలతో పాటు నిరుపేదలకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు చేకూరేలా పథకాలను రూపొందించినట్లు సమాచారం. జగన్ చెప్పింది తప్పకుండా చేస్తాడు అనే నమ్మకాన్ని ప్రజల్లో ఇప్పటికే తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రకటించే మేనిఫెస్టో కూడా పూర్తి స్థాయిలో అమలు పరిచే విధంగా ఉంటుంది అని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తన పార్టీ కార్యకర్తలకు తెలియజేశాడు.