ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి గా జత కట్టిన టీడీపీ, జన సేన, బిజెపి మధ్య గొడవలు రచ్చ కెక్కుతున్నాయి. నంద్యాల అసెంబ్లీ స్థానంలో కూటమి తరుపున టీడీపీ పోటీలో నిలబడింది. ఇక్కడ టీడీపీ పార్టీ తరపున నంద్యాల ఇంచార్జీ భూమా బ్రహ్మానందరెడ్డిని కాకుండా సీనియర్ నాయకుడు ఫరూఖ్ కి అవకాశము కల్పించారు. దానితో టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయి ఒక వర్గం ఫరూఖ్ సపోర్ట్ చేస్తు మరో వర్గం బ్రహ్మానందరెడ్డికి అండగా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటూ గొడవలు చేసారు. ఒక దశలో బ్రహ్మానందరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న అని ప్రకటించారు. అయితే పార్టీ అధిష్ఠానం చేసిన పంచాయితీకి ఒప్పుకొ ని చివరకు బ్రహ్మానందరెడ్డి,ఫరూఖ్ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మేము ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం అని ఫోటోలకు ఫోజు ఇచ్చారు గానీ ఇప్పటికీ ఎవరికి వారే యమున తీరే చందాన వున్నారు.
ఇక జన సేన పార్టీ కూటమి తరుపున తమకు పోటి చేసే అవకాశం వస్తాది అనుకోని తీరా టీడీపీకి టికెట్ ఇచ్చేసరికి ఆందోళన వ్యక్తం చేశారు. తరువాత టీడీపీ అభ్యర్థి ప్రచారానికి పిలవడం లేదు కనీస గౌరవం ఇవ్వక పోయేసరికి కూటమి పెద్దలకు ఈ విషయాలను చెబితే కనీస స్పందన రాకపోవడంతో టీడీపీతో కలసి పని చెయ్యడం వృధా అని భావించి జనసేన పార్టీకి రాజీనామా చేసి నంద్యాల జన సేన ఇంచార్జీ వైసీపీ లో జాయిన్ అయ్యారు. మరోవైపు బిజెపి నాయకులకు టీడీపీతో మొదటి నుండి పొసగడం లేదు దీనితో బిజెపి ముఖ్య నాయకులు అంతా వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ రకంగా పొత్తు వలన పోటీ పలచబడింది
ఒకవైపు తనకు టికెట్ దక్కలేదన్న కోపంతో రగిలిపోతూన్న భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ అభ్యర్థి ఫరూఖ్ తో అసలు కలిసి రావడం లేదు, మరోవైపు బిజెపి నాయకులు తాము కాదుగా పోటీ చేస్తుంది అందునా మైనారిటి నేతకి మనమెందుకు సపోర్ట్ చేయాలని ప్రచారానికి రావడం లేదు. వీరితో టీడీపీ కలిసి పనిచేసేలా యంత్రాంగం ఏర్పాటు చేసుకోలేదు, మరో వైపు తమని అవమానించారు అని జన సేన ముఖ్య నాయకులు వెళ్లిపోయిన తరువాత మిగిలిన నాయకులు కూడా టీడీపీ వంక చూసింది లేదు . ఇప్పుడు నంద్యాల్లో కూటమి పరిస్థితి ఎవరికి వారే యమున తీరే చందాన వున్నది.