బొత్తిగా చంద్రబాబు టైము బాగున్నట్టు లేదు. పొత్తు కుదిరింది అని ఆనందపడేలోపు.. అసంతృప్త తెలుగు తమ్ముళ్ళు కాక మీదకొచ్చారు. పోనీ పవన్ కళ్యాణ్ అయినా తన చరిష్మా చూపిస్తాడనుకుంటే… పిఠాపురంలో జనం అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. చినబాబు సైలెంట్ అయిపోయాడు, జగన్ సిధ్ధం సభలతో ముందుకెళ్ళిపోతున్నాడు. అలాంటి టైములో దెబ్బ మీద దెబ్బలా ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కేసు ముందుకొచ్చింది.
ఇష్టానుసారంగా నియమాలను మార్చి, నచ్చిన వారికి అప్పనంగా కాంట్రాక్టులు కట్టబెట్టి, బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీలను కూడా అందులోంచి తొలగించి, ప్రజల సొమ్మును తన మందకి అడ్డంగా దోచిపెట్టి… చంద్రబాబు చేసిన ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసులో కీలక ఆదేశాలు వచ్చాయి. గత కొంతకాలంగా ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తున్న ఫైబర్నెట్ కెసులో ఏపీ హోంశాఖ కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. నిందితులకు సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్ కు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టెరా సాఫ్ట్ సంస్థతో పాటు నలుగురు నిందితుల ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.
ఈ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వేమూరు హరికృష్ణ, గోపీచంద్, పవన్ దేవి, బాపయ్య తదితరులు నిందితులుగా ఉన్నారు. అంతే కాక సాక్షాత్తూ చంద్రబాబే ఏ1 గా ఉన్నారు. టెరా స్టాఫ్ సంస్థకు చెందిన 17.75 కోట్ల ఆస్తులు జప్తు చేయమని ఈరోజు ఉత్తర్వులు వెలువడ్డాయి. బీజేపీతో పొత్తు కుదిరినా ఈ కేసులు వదలడం లేదు ఏంటోనని పాపం తెలుగు తమ్ముళ్ళు నొచ్చుకుంటున్నారు.