జనసేన పార్టీ పెట్టిన మొదలు అనేక మంది ఆశావహులు ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నాయకులు పవన్ కళ్యాణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జనసేన వేదికగా తమకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు వస్తాయని కలలు కన్నారు. ఎన్నికల్లో స్థానాల కోసం పవన్ కళ్యాణ్ పొందడంమెప్పు కోసం శక్తికిమించి, వ్యయప్రయాసలకోర్చి, సర్వం త్యాగం చేసి పవన్ కళ్యాణ్ వెంట నడిచారు 10 ఏళ్లుగా జనసేన జెండా భుజాన మోసారు. అయితే ఊహించిన విధంగా ఎవరికీ జనసేనలో టికెట్లు లభించలేదు సరి కదా కట్టు బట్టలతో రోడ్డు నిలబడ్డారు.
జనసేనలో ఈ దుస్థితికి ఒకపక్క పవన్ కళ్యాణ్ నిలకడలేనితనం కారణమైతే మరొక పక్క పొత్తుల పందేరం మరో కారణం. ఇంతటి హోరాహోరీ పొత్తుల పోరులో జనసేన కి కేటాయించింది కేవలం 21 సీట్లు మాత్రమే.. అందులో కూడా స్థానాలు సంపాదించుకున్నది, జనసేన టికెట్లు తెచ్చుకున్నది ఇద్దరు ముగ్గురు కాపు సామాజిక వర్గపు నాయకులు మాత్రమే.. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి పవన్ కళ్యాణ్ స్థానం పిఠాపురం అయితే.. రెండో స్థానం కాకినాడ రూరల్ పంతం నానాజీ ది. ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఉమ్మడి టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి పంతం నానాజీకి ప్రత్యర్థిగా ఉన్నారు.
అధికార వైసీపీ అభ్యర్థి కన్నబాబు గతంలో ఒకసారి ప్రజారాజ్యంలో, మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైన తర్వాత ఇండిపెండెంట్ గానూ పోటీ చేసి హోరాహోరీ పోరులో 47 వేలకు పైగా ఓటు బ్యాంకు కొల్లగొట్టిన ప్రజాదరణ కలిగిన క్యాండిడేట్.. ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గత ఐదు ఏళ్ళుగా తన నియోజకవర్గంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అన్ని కులాలను మతాలను వర్గాలను రాజకీయాలకు అతీతంగా కలుపుకుంటూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు.
అయితే మొదటి నుంచి కేవలం కాపు సామాజిక వర్గం మాత్రమే ఓటు బ్యాంకుగా, వారి ఓట్లు మాత్రమే గెలుపుగా అడుగులు వేస్తూ మిగిలిన ఇతర సామాజిక వర్గాలను పక్కనపెట్టడంతో ఇతర సామాజిక వర్గాల్లో వ్యతిరేకత మొదలైంది. కాపు సామాజిక వర్గంలోనూ వైఎస్ఆర్సిపి ఓటు బ్యాంకు అనేది సహజంగా కొంత ఉంటుంది. ఈ నేపథ్యంలో కేవలం కాపులు ఓట్లు మాత్రమే గురిగా ముందుకు సాగుతున్న పంతం నానాజీ ఇతర సామాజిక వర్గాలను కలుపుకొని పోయే పరిస్థితి ఏమాత్రం కనబడటం లేదు. పక్కనే ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేస్తున్నాడు అని ప్రచారంలో చెప్పుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాలను రాజకీయాలకు అతీతంగా కలుపుకుంటూ ముందుకు పోతున్న అధికార పార్టీ అభ్యర్థి కన్నబాబు గెలుపు నల్లేరు మీద నడకే అని సర్వత్ర వినిపిస్తున్న మాట.