బీజేపీ తో పొత్తు కోసం అహర్నిశలు పాటుబడి, నానా పాట్లు పడి డిల్లీ లో పడిగాపులు కాస్తే చివరికి సరే అని బీజేపీ వారు పొత్తుకు అంగీకరిస్తే, ఏపీ కి వచ్చి ముస్లిం సమాజాన్ని మోసం చేయడానికి బీజేపీ వాళ్లే పొత్తుకు ఆహ్వానించారని సిగ్గు లేకుండా చెప్పుకున్న బాబు, పురంధేశ్వరి ద్వారా బీజేపీ కి కేటాయించిన సీట్లలో కూడా తన వారిని నిలుపుకుని బిజెపి కి మరోమారు వెన్నుపోటు పొడిచాడు..
బాబు ఆదేశాలతో కాంగ్రెస్ కు 30 కోట్ల ఫండ్ ఇచ్చిన ఫక్తు టీడీపీ అభిమాని అయిన సీఎం రమేష్ కు అనకాపల్లి సీటు, బాబు బినామీ అయిన సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సీటు వచ్చేలా పురంధేశ్వరి ద్వారా తన కార్యం చక్కబెట్టుకున్నాడు. అదే సమయం లో రాష్ట్రం లో బీజేపీ ని ఎప్పటి నుండో మోస్తున్న ఫక్తు ఆరెస్సెస్ వాదులైన కాపు వ్యక్తి సోము వీర్రాజుకు గానీ, వైజాగ్ ఎంపీ స్థానం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రాహ్మిణ్ అయిన జీవీఎల్ కు గానీ, విష్ణువర్దన్ రెడ్డి కి కానీ టికెట్ రాకుండా అడ్డుకున్నాడు… వీరికి టికెట్ రాకపోవడానికి అతి ముఖ్య కారణం వీరు ముగ్గురు పక్కా బాబు వ్యతిరేకులు, బీజేపీ లబ్ధి కోసమే పని చేసే నిస్వార్థ బీజేపీ వారు కావడమే.
వారికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ఒకవేళ గెలిస్తే వారు తన మాట ఖాతరు చేయరు అనే కారణం తోనే బాబు వారికి టికెట్ రాకుండా చేశాడు. ఈ మొత్తం ఉదంతాన్ని రాష్ట్ర బీజేపీ నాయకులు బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలియజేయడంతో పొత్తులో భాగం గా తాము 10 ఎమ్మెల్యే సీట్లకే ఒప్పుకున్నా, 11 అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తాము అని, రాజమండ్రి రూరల్ నుండి సోము వీర్రాజు బరిలో ఉంటారని ప్రకటించడం బీజేపీ తీసుకున్న అనూహ్యమైన నిర్ణయం. ఈ దెబ్బతో బాబుకు పొత్తు ధర్మం పై ఉన్న క్లారిటీ ఏమిటో, ఆయన చిత్తశుద్ధి ఎటువంటిదో తెలుసుకోవాలని బీజేపీ బావిస్తున్నట్లు సమాచారం..