తెలంగాణ రాష్ట్రంలో, నూతనంగా నియమింపబడుతున్న లెక్చరర్స్, డాక్టర్స్, కానిస్టేబుల్స్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ స్వాగత సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం ఫై తనకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి ఇంగ్లీష్ రాదు అని చాలామంది వెక్కిరిస్తున్నారని సభలో చెప్పుకొచ్చారు. అయితే తాము చదువుకునే రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బట్టి విద్యా ప్రమాణాలను బట్టి ఇంగ్లీష్ మీడియం చదువుల తమకు అందుబాటులో లేవని వల్ల తాము ఇంగ్లీష్ మీడియం లో చదువుకోలేకపోయామని తెలియజేశారు.
అయితే చైనా జపాన్ జర్మనీ దేశాలలో ఎవరికి ఇంగ్లీషు రాదు. అయినప్పటికీ ప్రపంచంతో పోటీపడిన అభివృద్ధిని ఆయా ఉత్పత్తిని ఆదేశాలు అందిస్తున్నాయి. ఇంగ్లీష్ అనేది ఒక ప్రముఖమైన భాష. ప్రపంచస్దాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఉపయోగపడే దిక్సూచి అని చెప్పారు. అలాగే నా సూచన ఏమిటంటే…ఇప్పటి పిల్లలకు ప్రతి ఒక్కరికీ ఇంగ్లిష్ మీడియం అందుబాటులో ఉండాలి. ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ మీడియం లో విధ్యనభ్యసించాలి అని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ రాదనే అవమానం నేటి పిల్లలకు ఎప్పటకీ ఎదురు కాకూడదు. అందుచేత పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తో కూడిన నాణ్యమైన విద్యను అందించాలి అని తెలియజేశారు.
ఒకపక్క పక్క రాష్ట్రాలు తమ పిల్లలకు ఇంగ్లీషు బోధనలో విద్యాబుద్దులు నేర్పించాలని తపన పడుతుంటే… ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ నాడు- నేడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి, నేటి పోటీ ప్రపంచంలో కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధనకు పునాదులు వేస్తుంటే… పేదవాడు ఎదిగితే ఎక్కడ బాగుపడిపోతాడోనన్న అక్కసు తో ఎక్కడ తమ ఆధిపత్యం చెలాయించలేమో అనేటువంటి అభద్రతా భావంతో ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీలు, చంద్రబాబు అడుగుజాడల్లో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తూ, తమ పెత్తందారీతనాన్ని బహిరంగంగానే. వెల్లడించడం సిగ్గుచేటు. అయితే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ విద్య బోధనను వ్యతిరేకిస్తున్న సదరు చంద్రబాబు ఇతర ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీ నాయకుల పిల్లలు మనవళ్ళు మనవరాళ్లు కార్పొరేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం లో చదువుల అభ్యసించడం గమనార్హం.