ఈ నెల 17వ తేదీ జరిగిన ప్రజాగళం సభ ఫెయిల్యూర్ ని పోలీసులపై నెట్టేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నించింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ ఫెయిల్యూర్పై ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేనకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. పరిధిలో లేని అంశంపై తమకు ఫిర్యాదు చేశారని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
బీజేపీ, టీడీపీ, జనసేన సభ విఫలం కావడానికి పోలీసులే కారణమంటూ గగ్గోలు పెట్టింది.సభలో మైకులు పని చేయకపోవడనికి, ఫ్లడ్డ్ లైట్ స్టండ్ల పైకి జనాలు ఎక్కడానికి కారణం కూడా పోలీసులు అంటే ఫిర్యాదు చేశారు. సభకు ప్రజలు రాలేదని కంప్లైంట్ ఇచ్చుంటే సరిపోయేది దీనికి కూడా పోలీసులు ప్రజలను తీసుకురాలేదు అని, పోలీసులను బ్లాక్ మెయిల్ చేయడానికి ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన బండారం.సీఈవో ముఖేష్ కుమార్ మీనా సమాధానంతో బట్టబయలైంది.
ప్రధానమంత్రి భద్రత అంశం తమ పరిధిలో లేదని సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ప్రధాని సభ భద్రత కేంద్ర హోంశాఖ, ఎస్పీజీ పరిధిలో ఉంటాయి. ప్రధాని పర్యటన భద్రత అంతా హోమ్ శాఖనే చూస్తుంది. ఎన్నికల కమిషన్కు ఇందులో ఎటువంటి పాత్ర ఉండదు. నాకు ఫిర్యాదు చేసినా నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ పై పెట్టిన పోస్టుల గురించి వైఎస్ఆర్సిపి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుని పరిశీలించిన ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి సోమవారం నోటీసులు జారీ చేశారు. వైయస్ జగన్ ను కించపరిచేలా టిడిపి సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతకర పోస్టులు 24 గంటల్లో తొలగించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సీఈవో స్పష్టం చేశారు.రెండు రోజుల క్రితమే టిడిపికి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కి ఎలక్షన్ కమిషన్ మొట్టికాయలు వేసింది. అంతలోనే ఇంకో విషయంలో ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది.