తమ వాడు అధికారం లో లేకపోతే ఎంత మంచి జరిగినా అది మంచే కాదు, మనోడు ఎంత బ్రష్టు పట్టించినా అది మాత్రం అద్భుతం అంటూ డప్పు కొట్టే రామోజీ ఈసారి వైద్య రంగం మీద పడ్డాడు. తెలంగాణ లో ఆస్పత్రుల భేష్, ఏపీ లో తుస్ అంటూ ఓ దిక్కుమాలిన కథనానికి తెర తీశాడు.. కేసీఆర్ అధికారంలో ఉన్నని రోజులు ఎక్కడ తన అక్రమ ఆస్తుల మీద, భూకబ్జాల మీద కన్నెర్రజేస్తాడో అని రోజు కేసీఆర్ పాలన గురించి ఆహా ఓహో అంటూ పొగిడిన రామోజీ, అధికారం కేసీఆర్ కోల్పోగానే తన నిజస్వరూపాన్ని బయటికి తీశాడు. ఇప్పుడు బాబు శిష్యుడైన రేవంత్ సీఎం అవ్వడం తో మళ్లీ రేవంత్ భజన అందుకున్నాడు. ఇప్పుడు రామోజీ దృష్టిలో ఆరు నెలలు తిరక్కుండానే రేవంత్ ప్రభుత్వం ఆస్పత్రులను భేషుగ్గా తయారు చేసినట్లు అన్నమాట. ఆశ్చర్యం ఏమిటంటే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా ఆరోగ్యానికి సంబంధించింది లేదు. రేవంత్ సీఎం అయ్యాక వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా వచ్చిన మార్పూ లేదు.. అయినా బేషే.. కానీ ఏపీ లో
విద్య వైద్య రంగాల్లో ఇండియా లో బహుశా ఏ సీఎం కూడా జగన్ చేసినట్టుగా చేయలేదు.వెయ్యిదాటిన ప్రతీ వైద్యాన్ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకోవచ్చి దాదాపు 3 వేల రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ కవరేజ్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం, తెలంగాణ లో అది 1000 రోగాలకు మాత్రమే పరిమితం..
శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ – 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీఎం జగన్ తీసుకొచ్చి ఉద్దానం ప్రజల దశాబ్దాల కష్టాన్ని తీర్చాడు..సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, డోర్నాల, కడప లలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టింది జగన్ ప్రభుత్వం.వైరస్ వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ CCMB (Centre for Cellular & Molecular Biology) లాంటింది గన్నవరం లో ఏర్పాటు చేసారు..
కరోనా కష్టకాలం లో జగన్ చూపించిన చొరవ దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. కరోనా ను ఎదుర్కోవడం లో ఏపీ 2 వ స్థానం లో ఉంది అని లోకల్ సర్కిల్ అనే ప్రముఖ సంస్థ తేల్చి చెప్పింది. కరోనా వాక్సినేషన్ లో ఏపీ ఫస్ట్ అని కేంద్రం కితాబు ఇచ్చింది.
వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినట్లు గా మునుపెన్నడూ జరగలేదు అనేది అంకెలు చెప్పే వాస్తవం..
స్పెషలిస్ట్ డాక్టర్లు-4,324.
మెడికల్ ఆఫీసర్లు-2,475.
స్టాఫ్ నర్సులు-6,734.
ఏఎన్ఎంలు-13,540.
మల్టీలెవల్ హెల్త్ ప్రొవైడర్లు-10,032.
పారా మెడికల్ సిబ్బంది-9,751.
వైద్య ఆరోగ్య శాఖలో క్లాస్ 4 ఉద్యోగాలు -3,303.
డేటా ఎంట్రీ ఆపరేటర్లు-249.
కొత్త మెడికల్ కాలేజీల్లో సిబ్బంది-1,582.
ఇతరులు-1,476.
ఇలా భర్తీ చేసిన మొత్తం పోస్టులు-53,466.
ఇక మెడికల్ కాలేజీ ల విషయానికి వస్తే, రాష్ట్రంలో మొదటి వైద్య కళాశాల ఆంధ్రా మెడికల్ కాలేజీ 1923లో ఏర్పాటైంది.
అప్పటి నుంచి 2019 వరకు అంటే బాబు దిగిపోయేనాటికి 96 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలు 11 మాత్రమే. బాబు హయాం లో అనగా తన 14 ఏళ్ల అధికార కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలజీ కట్టలేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు కడితే కార్పొరేట్ వైద్య యాజమాన్యాలకు నష్టం కదా.. కానీ సీఎం జగన్ అధికారం లోకి వచ్చాకా 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయగా అందులో 5 కాలేజీ లు ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే విద్యా సంవత్సరం నుండి అడ్మిషన్లు తీసుకోడానికి సిద్ధం gaa ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలు వివిధ నిర్మాణ దశల్లో ఉండి 2025-26 విద్యా సంవత్సరానికి పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి..
సీఎం వైఎస్ జగన్ 2021 సెప్టెంబర్ 11న శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. కేవలం ఎనిమిది నెలల్లోనే దీన్ని అందుబాటులోకి తెచ్చారు.అలాగే ప్రాథమైన ఆరోగ్య కేంద్రాలను చిత్తశుద్ధితో పని చేసే విధంగా డా. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ పేరుతో 1692 కోట్ల వ్యయం తో భవన నిర్మాణం, మరమ్మతులు చేపట్టారు.. సీహెచ్ సీలు, ఏరియా ఆసుపత్రులు నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం 1223 కోట్ల రూపాయల వ్యయం చేశారు…
ఫ్యామిలీ డాక్టర్ పేరుతో గ్రామీణులకు మరింత చేరువైన వైద్యం.. మారుమూల ప్రాంతాలలో డాక్టర్ గా పని చేస్తే ఎక్కువ జీతం ఇస్తామని మానవతా దృక్పథం తో డాక్టర్ల భర్తీ చేసి వైద్య సదుపాయాలను ఇంటి ముందుకు చేర్చారు.. వీటన్నింటికీ తోడు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల పేరుతో ఎప్పటికప్పుడు గ్రామీణుల ఆరోగ్య స్థితిగతులను అంచనా వేయడం, వారికి అవసరం అయిన మందులను ఉచితంగా అందించడం చేస్తుంది ఈ ప్రభుత్వం..
వీటికి తోడు: 104 108 సేవల కోసం 1,704 అంబులెన్సులు, 500 తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ లు మొత్తంగా మొత్తం 2,204 అంబులెన్సులు నూతనంగా రాష్ట్ర ఆరోగ్య సేవలకు అందించింది. దేశంలో మరెక్కడా ఇంత డెన్సిటీ తో ఆంబులెన్స్ లు లేవు. WHO ప్రమాణాలకు మించి రాష్ట్రం లో అంబులెన్స్ లు అందుబాటులో ఉన్నాయి..
కేంద్ర విద్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంటీవల ప్రకటించిన అవార్డులలో మూడు విభాగాలలో రెండింటినీ ఏపీ ప్రభుత్వమే పొందింది అనే విషయం కూడా రామోజీ కి తెలీకపోవచ్చు. బహుశా ఆస్పత్రులు అని రామోజీ రాసుకొచ్చింది కార్పొరేట్ ఆస్పత్రులు కావచ్చు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ బడులు వారి కంటికి అనవు. అవి బాగుంటే తమ వారి కార్పోరేట్ వ్యవస్థ అద్దః పాతాళానికి పోతుంది అనే బెంగ ఉండటం సహజమే కాబట్టి ఈ విషం చిమ్మే కార్యక్రమం మన రాష్ట్ర ప్రజానీకానికి తప్పదు..