2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనకి ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. పొత్తులో భాగంగా టీడీపీ – జనసేన కూటమిగా ఉండడం తెలిసిందే. అయితే జనసేన గుర్తు అయినా గాజు గ్లాస్ విషయంలో సంధిగ్తత నెలకొoది. కొన్ని నెలల క్రితం గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గా చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే జనసేన పార్టీ అభ్యర్థన మేరకు ఈ సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించి ఈసీ ఆదేశాలను జారీ చేసింది. ఇందులో కొసమెరుపు ఏంటి అంటే జనసేన పోటీ చేయని మిగిలిన నియోజక వర్గాలలో ఫ్రీ సింబల్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ , 3 పార్లమెంట్ నియోజక వర్గాలలో పోటీ చేస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తు జనసేనకే ఉంటుంది , మిగిలినటువంటి 151 అసెంబ్లీ ,22 పార్లమెంట్ స్థానాలలో గాజు గ్లాస్ గుర్తుపైన ఎవరైనా పోటీ చేయవచ్చు అంటూ వెల్లడించింది ఈసీ. ఒకవేళ గాజు గ్లాస్ గుర్తుపై ఎవరైనా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తే టిడిపికి భారీ నష్టం ఏర్పడుతుంది. పొత్తులో భాగంగా పడాల్సిన ఓట్లన్నీ కూడా స్వతంత్ర అభ్యర్థులకే పడే అవకాశం ఉంటుంది.