ఆంద్రప్రదేశ లో జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల అనంతరం మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా సీఎంగా మళ్ళీ జగన్ ఈసారి విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు ఇప్పటికే ఆ పార్టీలోని ముఖ్యనేతలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే విశాఖలో ఆ సందడి మొదలైపోయింది. జగన్ ప్రమాణా స్వీకారానికి ఒక పక్క విశాఖలో ఏర్పాట్లు జరుగుతుండగా మరోపక్క ఆ ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని కనులారా చూసేందుకు ఆ పార్టీ క్యాడర్ సంసిద్దమైంది. దీనికి తగ్గట్టుగానే జూన్ 8,9 తేదీలల్లో విశాఖలో ఉన్న హోటల్స్ పెద్ద ఎత్తున బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం విశాఖలో చిన్న హోటల్స్ తో మొదలై స్టార్ హోటల్స్, సర్వీస్ ఆపార్ట్మెంట్స్ వరకు అన్నీ కూడా ప్రీ బుకింగ్ అయిపొయాయని వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పుడు జగన్ ప్రమాణ స్వీకారం ఎఫెక్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ ని కూడా తాకినట్టు తెలుస్తుంది. జూన్ 9వ తేదీ ఉదయం 9:38 నిమషాలకు వైజాగ్ లో సీఎం గా జగన్ ప్రమాణస్వీకారం ఉంటుందని తెలియడంతో, జగన్ ప్రమాణస్వీకారం చూసేందుకు వెళ్ళడానికి వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు సిద్దమవుతున్న వేళ ఇదే అదనుగా విశాఖకు టికెట్ ధరలను భారీగా పెంచేశారు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. టికెట్ రేటు గతంలో పోల్చితే డబుల్ అయినట్టు టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రయాణికులు చెబుతున్న మాట. ఫలితాలు రాకముందే విశాఖలో ఈ స్థాయి సందడి కనిపిస్తుందని , ఇక జగన్ అధికారంలోకి వచ్చి విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చితే హైదరాబాద్ కు ధీటుగా విశాఖ మారుతుందనే ధీమా తమలో ఉందని విశాఖ వాసులు చెబుతున్నమాట.