మహా టీవీ. ఇది పూర్తిగా ఎల్లో ఛానల్. నిద్ర లేచింది మొదలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద వేయడమే దీని పని. కట్టు కథలు చెబుతూ ఉంటుంది. ఇక దీని మేనేజింగ్ డైరెక్టర్, యాంకర్ అయిన వంశీకృష్ణ డిబేట్లలో చిత్రవిచిత్రంగా మాట్లాడుతుంటాడు. చంద్రబాబు నాయుడికి హైప్ ఇవ్వడంలో ఇతర ఎల్లో జర్నలిస్టులతో పోటీ పడుతుంటాడు. ఏదో పచ్చ కార్యకర్తలా నోటికొచ్చింది చెప్పేస్తుంటాడు.
వైఎస్ జగన్ ప్రభుత్వం పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. తెలుగుదేశం నాయకులకు కార్పొరేట్ స్కూళ్లు ఉండడంతో వాటిల్లో పిల్లల సంఖ్య తగ్గి ఆదాయం రాదని ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టించి తెలుగు చచ్చిపోతోందని చెప్పించారు. వంశీ కూడా ఆనాడు తెగ బాధపడిపోయాడు. ఆరోజుల్లో పైకి తెలుగు బాగు కోసమని నటించి కార్పొరేట్ నుంచి భారీగా వసూళ్లు చేసిన చరిత్ర ఉంది.
తెలుగు కోసం గెంతెత్తానని చెప్పుకొనే వంశీ తన ఛానల్లో మాతృభాషకు తెగులు పట్టిస్తున్నాడు. యూట్యూబ్లో పోస్టు చేసే వీడియోలకు ఉండే థంబ్ నెయిల్స్ చూస్తే అతడికి తెలుగు ఎంత బాగా వచ్చు.. ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. సూపర్ టైమ్ విత్ వంశీ, ది లీడద్ వంశీ ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. అవే కాక మరిన్ని వీడియోలపై కనిపించే పదాల్లో బోలెడు తప్పులు దర్శనమిస్తున్నాయి. భాష చాలా ముఖ్యం. తప్పులు దొర్లకుండా చూడాల్సిన వ్యవస్థ కూడా మనోడి దగ్గర లేదనిపిస్తోంది.
పోటీపై రఘురామా కీలక వ్యాఖ్యలని ఓ వీడియోకు రాశారు. వాస్తవానికి రాఘురామ అని రాయాలి. నేను జగన్ను ఎదిరించానని వైసీపీ నేతలు నాకు వార్నింగ్ ఇచ్చారు. దేనికైనా సిద్దమే.. అంటూ శ్రీధర్రెడ్డి వీడియోపై రాశారు. అది సిద్దం కాదయ్యా.. సిద్ధమే అనాలి. చిత్తూరు జిల్లా స్మశానవాటికలో క్షుద్రపూజలు కలకలమని పెట్టారు. శ్మశానవాటికలో క్షుద్రపూజల కలకలం అని కదా రాయాలి. వీపీఆర్పై మాస్ పాటలు. సింగర్గా కిరాక్ ఆర్పీ.. ఉపు తెస్తున్న సాంగ్స్ అని పెట్టారు. ఉపు కాదు నాయనా.. ఊపు అనాలి. కిర్రాక్ అంటారు. షర్మిల వ్యాక్యలపై బీటెక్ రవి రియాక్షన్ అన్నారు. వ్యాఖ్యలు అని రాయాలి. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన కిల్లి కృపారాణి అన్నారు. వైసీపీ అంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని. మళ్లీ వైసీపీ పార్టీ ఏంటి?, సర్వేలో కూటమి సునామి, చేతికిలపడ్డ జగన్ ఫ్యాన్.. వంశీ వీడియోకు రాసిన మాటలివి. సునామి కాదయ్యా బాబూ.. సునామీ అని రాయాలి. చతికిలపడ్డ అయితే చేతికిలపడ్డ అని రాశారు చూడు.. గొప్పోళ్లబ్బా..
ఇలా చెప్పుకొంటూ పోతే చాలు ఉన్నాయి. టీడీపీ ఆశాకిరణం చినబాబు లోకేశ్కి తెలుగు రాదు. వాళ్లను నిత్యం పొగడ్తల్లో ముంచెత్తే ఎల్లో మీడియాలో చాలామందికి భాషపై పట్టు లేదు. ఇదంతా ఇంగ్లిష్ మీడియం బ్యాచ్. తమ పిల్లల్ని అందులోనే చదివిస్తుంటారు. కానీ పైకి మాత్రం తెలుగును బతికిస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. జగన్ ఏపీ పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు అందించేందుకు ఇంగ్లిష్ను నేర్పిస్తున్నారంతే.. ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఇక వంశీ.. నువ్వు కొద్దిరోజులు తెలుగు టీచర్ను పెట్టించుకుంటే మేలని.. సదరు వీడియోల కింద కామెంట్లు వస్తున్నాయి. ఆ పని చేయొచ్చు కదా..