తెలుగుదేశం నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణకు యువతతో బాగా పని పడింది. ఎంత డబ్బు ఖర్చు చేసైనా వారిని ఎన్ టీంలోకి తీసుకోవాలని అనుచరులను ఆదేశించారు. దీంతో వాళ్లు వార్డులకు వెళ్లి యువత వెంట పడుతున్నారు. నారాయణతో మీటింగ్లు అరేంజ్ చేస్తున్నారు.
నారాయణ ప్రజల మనిషి కాదు. కార్పొరేట్ విద్యాసంస్థల అధినేత. రాజకీయాల ద్వారా సేవ చేయాలని ఆయనకు ఏ మాత్రం లేదు. కేవలం పవర్ను ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. 2019లో ఓడాక సిటీని పట్టించుకోలేదు. 24 ఎన్నికలకు ఐదారు నెలల ముందే వచ్చిన విషయం తెలిసిందే. ఎన్ టీం అంటూ సుమారు మూడువేల మందిని నియమించారు. వీరికి నెలకు స్థాయిలను బట్టి రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు ఇస్తున్నారు. ఇప్పుడు నారాయణకు కొత్త కష్టం వచ్చి పడింది. టీం కోసం మనుషులను అడిగితే చాలామంది సీనియర్ నాయకులు పెద్ద వయసు వారిని పనిలో పెట్టారు. వారు రోజూ తిరగలేకపోతున్నారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉండడంతో రెండు, మూడు ఇళ్లకు వెళ్లి నామమాత్రంగా ఫొటోలు తీసి పెట్టి సొంత పనులు చూసుకుంటున్నారని ఇటీవల నారాయణ చెవిలో పడింది.
వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే చాలామంది పనిచేయడం లేదని సన్నిహితుల వద్ద నారాయణ వాపోయారు. దీంతో ఎన్ టీంను పూర్తిగా యువతతో నింపాలని, 30 సంవత్సరాల్లోపు ఉండే వారినే తీసుకోవాలని, ఎంత డబ్బు ఖర్చు చేసినా సరేనన్నారు. దీంతో అనుచరులు యువత కోసం వార్డుల్లో ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు. యూత్ గ్యాంగ్లను పట్టుకుని రోజూ సాయంత్రం వేళల్లో నారాయణ వద్దకు తీసుకెళ్తున్నారు. ఆయన నెలకు ఇంత మొత్తం ఇస్తామని పనిచేయాలని అడుగుతున్నారు. ఒక ఇంటికి వారానికి ఐదారు సార్లు వెళ్లాలని చెబుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి.. వర్షం పడేలా ఉందంటూ సాకులు చెప్పకుండా యాక్టివ్ ఉండాలంటున్నారు. కొంతమంది చేరారు. టీం సభ్యులకు ఇటీవల ఉగాది సందర్భంగా రూ.5 వేల చొప్పున అదనంగా ఇచ్చారు.
కళ్ల ముందు నారాయణ ఎన్ టీం అంటూ మనుషులను తిప్పుతూ కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈసీ స్పందించకపోతే ఆ విద్యాసంస్థల అధినేత యువతను పూర్తిగా చెడిపేసే ప్రమాదముంది.