ప్రస్తుత ఎన్నికలు డబ్బుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరు అధికంగా డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టుకోగలరో వారికే టిక్కెట్లు కేటాయించారు. అలా కేటాయించిన సీట్లలో ఒకటి అనంతపురం అర్బన్ నియోజకవర్గం. ఇక్కడ మొన్నటి వరకు టీడీపీ కి ప్రభాకర్ చౌదరి ఇంచార్జిగా వుండేవారు. చంద్రబాబు ఎలక్షన్ కి 30 కోట్లు సిద్ధం చేసుకోవాలి అని చెప్పడంతో ప్రభాకర్ చౌదరి తాను అంత పెట్టుకోలేను కానీ తన తరుపున ఓ 20 కోట్లు ఖర్చు పెడతారు అని చంద్రబాబు నాయుడుకు విన్నవించుకున్నారు. దీనితో చంద్రబాబు నాయుడు ఎలాంటి మొహమాటం లేకుండా నీకు సీటు ఇవ్వలేను అని చెప్పి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటా అని ముందుకు వచ్చిన మరో నాయకుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు టికెట్ కేటాయించారు. దీనితో నియోజకవర్గంలో అలజడి మొదలైంది కార్యకర్తలతో సంబంధం లేని ప్రజాబలం లేని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు టికెట్ ఎలా కేటాయిస్తారు అంటూ నియోజకవర్గ పార్టీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీద చిన్నపాటి యుద్ధమే ప్రకటించారు.
పార్టీ పెద్దలు నియోజకవర్గ నాయకులతో ముఖ్యంగా ప్రభాకర్ చౌదరితో మాట్లాడి పార్టీ మారకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వుండకుండా నచ్చచెప్పారు. కానీ ప్రభాకర్ చౌదరి గ్రౌండ్ లో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు ఏ మాత్రం సహకారం అందించడం లేదు. ప్రచారంలో కలిసి పాల్గొనడం లేదు, అలాగే కీలక నేతలు అయిన సుధాకర్ నాయుడు, కొండవీటి భావన వంటి వారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రచారం గురించి పార్టీ కార్యక్రమల గురించి కనీస సమాచారం ఇవ్వడం లేదు మమ్మల్ని అవమిస్తున్నాడు అని ఇప్పటికే పార్టీకి దూరం జరిగారు. ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కోవడంతో పాటు కొంత మంది వైసీపీ కార్పొరేటర్ల ను లక్షలు ఇచ్చి కొన్నాడు దగ్గుబాటి, కానీ వారు డబ్బు తీసుకొని చివరకు పత్తా లేకుండా పోవడంతో బిక్కమొక మేయడం దగ్గుబాటి వంతు అయ్యింది . నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్య నాయకులు,, మండల స్థాయి నాయకుడిని డబ్బులు తీసుకొని అభ్యర్థిగా పెట్టారు అతనికి ఎలక్షన్ ఎలా చెయ్యాలి అని కూడా తెలియడం లేదు, ఇలా అయితే ఇక్కడ ఓడిపోవడం తథ్యం అంటూ పార్టీ పెద్దలకు మొర పెట్టుకున్నారు.
కోట్లకు కోట్లు ఖర్చు పెట్టిన సీటులో ఎవరు కలిసి రాక దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఒంటరి వాడు అయ్యి ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో నిలబడ్డారు. ఇటు టీడీపీ మీద విరక్తితో ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడం, పార్టీ నాయకులు కనీస ప్రచారానికి రాకపోవడంతో నిర్వేదంలో మునిగిపోయారు.