తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నీతి, నిజాయితీ లేని వ్యక్తి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లిం, మైనార్టీల ఉనికిని దెబ్బ కొట్టి వారి భవిష్యత్ను అంధకారం చేసే సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) రూల్స్ నోటిఫై చేసి ప్రమాదంలోకి నెట్టిన బీజేపీ కుతంత్రాలపై రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలకు ఆత్మగౌవరం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్రాన్ని కట్టబెట్టేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. మైనార్టీల ఉనికిని దెబ్బతీస్తున్న పార్టీని బలపరుస్తూ నేరం చేస్తున్నారన్నారు. కమలం పార్టీతో కలిసి లౌకికవాదాన్ని ఎలా కాపాడుతుంది?•• రాష్ట్రానికి అన్యాయం చేశారని బయటకు వచ్చామని ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పారు. పది సంవత్సరాల్లో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలి.• టీడీపీ – బీజేపీ – జనసేనది విద్రోహ కూటమి. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కలిసినట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో చేరి టీడీపీ, జనసేన కార్యకర్తల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. వారు కోపంతో రగిలిపోతున్నారు. స్టీల్ప్లాంట్ విషయంపై బాబు, పవన్ ఎందుకు మాట్లాడడం లేదు. కేంద్రం రైల్వే జోన్ ఇవ్వలేదు. పోలవరానికి నిధులు ఇవ్వలేదు.• రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీతో ఎలా కలిశారు. వీరి పొత్తు రాష్ట్రాన్ని ముంచేస్తుంది. 21 సీట్లు తీసుకోవడాన్ని చూసి జనసేన నేతలు సిగ్గు పడుతున్నారు.• ఆత్మగౌరవం లేని పార్టీలు ఉంటే ఎంత? లేకపోతే ఎంత? వామపక్షల మద్దతుతో ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే సీఏఏ అమల్లోకి రాదు. అదే మైనార్టీలకు రక్ష. మత సామరస్యానికి గ్యారెంటీ.