తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిలో ఒక ప్రత్యేక ఉంది. పాజిటివ్ విషయం కాదు. తన స్వార్థం కోసం ప్రతి పార్టీలోనూ మనుషులను ఏర్పాటు చేసుకుంటారు. వారికి డబ్బులిచ్చి పొగిడించు కుంటుంటారు. భారతీయ జనతా పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో బాబు కోసం పనిచేసే వారు ఉన్నారు. జనసేన విషయానికొస్తే అది పెట్టించింది టీడీపీనే కాబట్టి ఎప్పుడూ నారా వారి భజనలో ఉంటుంది.
సీపీఎం, సీపీఐ పార్టీలకు ఘనమైన చరిత్ర ఉంది. పేద ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తుంటారని పేరుంది. కానీ మన రాష్ట్రంలో రివర్స్లో జరుగుతుంది. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ చదవడమే ఆయా పార్టీల్లోని కొందరు నేతల పని. ఎల్లో పత్రికలు, టీవీ చానల్స్లో డిబేట్లకు వెళ్లి టీడీపీకి నచ్చని వారిని తిడుతుంటారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ అని ఒకాయన ఉన్నారు. ఈయనకు చంద్రబాబు అప్పగించిన పని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడం. ప్రజలకు కావాల్సిన వాటి విషయంలో ప్రభుత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ప్రశ్నిస్తుంటాయి. అందులో తప్పేమీ లేదు. అలా అడగాలి కూడా. అదే సమయంలో మంచి చేస్తే హర్షించాలి. కానీ రామకృష్ణ అలా కాదు. ఒళ్లంతా పసుపు రంగు పూసుకున్న వ్యక్తిలా ప్రవర్తిస్తుంటారు. బాబు పంపే స్క్రిప్ట్ను అలాగే చదివేస్తారు. ఆయా అంశాలపై తమ పార్టీ లైన్ను కూడా పట్టించుకోరు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. భూమి ఇచ్చి ఇళ్లు కట్టించాలని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడూ అడుగుతుంటాయి. ఏపీలో జగన్ 30 లక్షల మందికి పైగా పేద మహిళలకు భూ పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తున్నారు. ఇవేమీ ఆయనకు కనిపించవు. ఎదురుగా పచ్చ మీడియా కనిపిస్తే చాలు జగన్పై రెచ్చిపోతుంటారు.
ఇటీవల చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీకి వెళ్లి అమిత్షా, జేపీ నడ్డాను కలిశారు. ఆ సమయంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఇక్కడ విలేకరుల సమావేశాలు జరిగాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ బాబు చేసిన పనిని తప్పు పట్టారు. షాతో చేసుకున్న చీకటి ఒప్పందాలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీని ఎలా భుజానికి ఎత్తుకుంటున్నారని నిలదీశారు. పదవుల కోసం స్వార్థంతో కమలం పార్టీ చుట్టూ తిరుగుతున్నారని బాబును తిట్టి పోశారు. స్వయానా ఇవన్నీ మాట్లాడిన రామకృష్ణకు కొద్దిరోజులకే బాబు నచ్చేశాడు. ఎంతైనా తన బాస్ కదా.. సీనియర్ జర్నలిస్ట్ పేరుతో పచ్చ ముఠాకు చెందిన ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకావిష్కరణ గురువారం రాత్రి విజయవాడలో జరిగింది. దీనికి స్పాన్సర్ ఎవరో కాదు. స్వయానే చంద్రబాబే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. బీజేపీతో ఎలా కలుస్తారని రెచ్చిపోయి మాట్లాడిన రామకృష్ణ నారా వారి పిలుపునకు స్పందించకుండా ఉండలేపోయారు. అదేంటండి కొద్దిరోజుల క్రితం తిట్టారు కదా అంటే.. అది మొన్నరా.. అనే రీతిలో సభలో హాజరు వేయించుకున్నారు. పనిలో పనిగా బాబును సంతోష పెట్టేందుకు జగన్ను నానా మాటలు అన్నారు. డబ్బులిస్తున్న బాస్ సంతోషం కోసం ప్రభుత్వంపై కేకలు వేశారు. ఇక్కడ మద్యం ద్వారా వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందంట.. జగన్ను వెయ్యి సంవత్సరాలు జైల్లో పెట్టాలట. ఇవి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడి మాటల్లా ఉన్నాయా.. తెలుగు తమ్ముడు చేసే వ్యాఖ్యాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చేశారు. బాబు నుంచి రామకృష్ణ ఏ స్థాయిలో లబ్ధి పొందకపోతే ఇలా అంటారు. ఇతర పార్టీలు తిడితే జనం నమ్మేస్తారని నారా వారి ఆశ. కానీ జనం అంత అమాయకంగా లేరని ఈ నాయకులకు ఎప్పటికి అర్ధమవుతుందో