సీఎం జగన్ జనవరి 24 బుధవారం నాడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు. ఇందునిమిత్తం బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. ముఖ్యమంత్రి తిరుపతి రానుండడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ తిరిగి బయలుదేరి రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు సీఎంవో అధికారులు పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు. కాగా ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో అడాప్టింగ్ ఎక్సలెన్స్, విద్యలో డిజిటల్ రెవెల్యూషన్, స్కిల్ డెవల్పమెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేఅంశాలపై చర్చ జరగనుందని సమాచారం.