ఆంధ్రప్రదేశ్లో జనం జగన్ నామస్మరణను ఆపలేదు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఓవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ గ్రీన్సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్, వామపక్షాల చేత కూటమి కట్టించారు. అయినా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ప్రతిపక్షాల సభలు పేలవంగా జరుగుతున్నాయి. జగన్ సిద్ధం సభలు సూపర్ హిట్ అవుతున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు వైఎస్సార్సీపీకి 120 సీట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే టీడీపీతో పొత్తుకు వెనుకంజ వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎన్నికల సర్వే నిపుణుల అంచనా ప్రకారం 115 సీట్లు, ఏపీ జర్నలిస్టు ఫోరం లెక్కల ప్రకారం 130, ఆరా మస్తాన్ సర్వే (లీక్) ప్రకారం 100 సీట్లకు పైగా జగన్కు వస్తాయి.
గతంలోనూ..
చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఆరు జిల్లాల్లో సర్వే చేసి ఈ ఏడాది జనవరి 19న ఫలితాలు వెల్లడించింది. దీని ప్రకారం వైఎస్సార్సీపీకి 131 అసెంబ్లీ సీట్లు వస్తాయి. టీడీపీ, జనసేన కూటమికి 20లోపే రావొచ్చు. పొలిటికల్ క్రిటిక్ సర్వే ఫలితాలు అదే నెల 22న విడుదల కాగా ఎంపీ సీట్లు వైఎస్సార్సీపీకి 18, టీడీపీ, జనసేన కూటమికి 7 వస్తాయని చెప్పింది. అసెంబ్లీ సీట్లు వైఎస్సార్సీపీకి 115 నుంచి 120, టీడీపీ, జనసేన కూటమికి 60 నుంచి 65 మధ్య రావొచ్చు. జన్మత్ పోల్ సర్వే వివరాలను జనవరి 28వ తేదీన విడుదల చేశారు. దీని ప్రకారం ఎంపీ సీట్లు జగన్ పార్టీకి 18 నుంచి 20, బాబు, పవన్కు 3 నుంచి 4 మాత్రమే వస్తాయి. ఇక అసెంబ్లీ సీట్ల విషయానికొస్తే వైఎస్సార్సీపీకి 114 నుంచి 117, టీడీపీ, జనసేన కూటమికి 49 – 51 మధ్య రావొచ్చు. ఫిబ్రవరి 7వ తేదీన టైమ్స్ నౌ విడుదల చేసి సర్వే ఫలితాలను చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్కు 19 ఎంపీ సీట్లు రావొచ్చు. అదే టీడీపీ, జనసేన కూటమి ఆరు సీట్లకే పరిమితం కానుంది.
రైజ్ సర్వే సంస్థ తప్ప మిగతా లోకల్ సర్వే సంస్థలు వైఎస్సార్సీపీకి 130 సీట్లకు పైగా వస్తాయని అంచనా వేస్తున్నాయి. అలాగే ఇండియా టుడే సీ ఓటర్ తప్ప జాతీయ వార్తా సంస్థల అంచనా ప్రకారం జగన్కు వచ్చే ఎన్నికల్లో 120 స్థానాలు దక్కుతాయి. ఇకపోతే తెలుగుదేశం చేయించుకున్న 6 సర్వేల్లో వైఎస్సార్సీపీకే పాజిటివ్ ఉంది. 90 సీట్లకు పైగానే వస్తాయని వాటి ఫలితాలు వెల్లడించాయి. ఏతా వాతా అన్నీ సర్వేల్లో తేలింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మళ్లీ జగనే.. 2024లోనూ ‘ఫ్యానే’.
సర్వే సంస్థలు ఇస్తున్న షాక్లతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిక్కుతోచడం లేదు. అందుకే ప్రజలకు ఏమి చేస్తామో చెప్పే బదులు ఆయన్ను వ్యక్తిగతం తిడుతున్నారు. ఓటర్లు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. జగన్ అడిగినట్లుగా రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కడానికి..