మేమంతా సిద్ధం పేరుతో సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర, అశేష జనవాహినితో ముందుకు సాగుతుంది. ఉమ్మడి కడప జిల్లా పర్యటన పూర్తి చేసుకుని కర్నూలు జిల్లాలో సాగుతున్న ఈ బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తుంది. యాత్ర లో భాగంగా పత్తికొండ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ను పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం సహా ఇతర కర్నూలు జిల్లా నేతలు కలిశారు.
వారితో సుమారు 1 గంటా 30 నిమిషాలకు పైగా చర్చలు జరిపారు. పలువురు పార్టీ నేతలను, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం శ్రీ వైయస్.జగన్.. రానున్న సార్వత్రిక ఎన్నిలల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి, గడపగడపకు చేయాల్సిన ప్రచారం గురించి వారికి వివరిస్తూ, మన ప్రభుత్వం లో అందిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలందరికీ తెలియజెప్పాలని,మన ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ రూపు రేఖలు ఎలా మారాయో, ఇంటింటికి అందుతున్న సంక్షేమం ఎంత అని, ప్రజలకు ఆధారాల్తో వివరించాలని. 2019 ఎన్నికల్లో లాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు..
కాగా పొత్తు మూలాన టీడీపీ లో జరుగుతున్న రభస వల్ల టీడీపీ కి చెందిన పలువు అసంతృప్త నేతలు మూకుమ్మడిగా వైసీపీ లో చేరుతున్నారు. ఈ నేపథ్యం లో టీడీపీ కి ఇప్పటికే పట్టు కోల్పోయిన రాయలసీమ ప్రాంతం అందునా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన తర్వాత టీడీపీ మరింత పతన స్థాయికి పడిపోయింది. జిల్లా మొత్తం మీద కనీసం ఒక్క నియోజకవర్గం లో అయినా పోటీ ఇచ్చే స్థాయిలో ఆ పార్టీ లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..