వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాస్ ఇమేజ్ ఎక్కువ.. ఊరి పేరు చెబుతూ చేతిని ఊపే సమయంలో ప్రజల నుంచి వచ్చే ఉత్సాహం ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రజాసంకల్ప యాత్ర, 2019 ఎన్నికల సమయంలో జగన్ సభలకు జనం పోటెత్తారు. కనుచూపు మేర జనమే కనిపించేవారు. మళ్లీ ఆరోజులు వచ్చేశాయి. 2024 ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రంలోని నాలుగుచోట్ల సిద్ధం సభలు పెట్టింది. వీటికి లక్షల మంది తరలివచ్చారు. ఈసీ షెడ్యూల్ ప్రకటించాక జగన్ పూర్తిస్థాయిలో ప్రచారానికి వస్తున్నారు. ఇప్పటికే ఆయన 175 అసెంబ్లీ సీట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.
వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి పార్టీ ఏర్పాట్లు చేసింది. బుధవారం ఉదయం 10:56 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్ కడపకు బయలుదేరారు. 12:20కు ఇడుపులపాయ చేరుకుంటారు.• మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1:20 వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 1:30కి బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. వేంపల్లి, వీఎన్ పల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు అక్కడ బహిరంగ సభలో నిర్వహిస్తారు. అనంతరం జగన్ దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకుంటారు. ఆ రాత్రి ఆళ్లగడ్డలోనే బస చేస్తారు.
టీడీపీ, బీజేపీ, జనసేనలు ఇంకా టికెట్ల కేటాయింపుపై తర్జనభర్జన పడుతుంటే జగన్ తనదైన వూ్యహాలతో దూసుకెళ్తున్నారు. ప్రజా క్షేత్రంలో ఆయన్ను ఢీకొట్టే సత్తా ప్రస్తుతం ఎవరికీ లేదు. జగన్ బలమే జనం. ఆయన వారి మధ్యకు వస్తే అభిమానాన్ని ఆపడం కష్టం. అందుకే చంద్రబాబు అండ్ గ్యాంగ్ భయపడుతోంది. చిరునవ్వుతో గుంటూర్.. నెల్లూర్.. కడప.. తిరుపతి.. అంటూ జగన్ చెప్పే మాటల కోసం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోంది.