ఎవరు ఏ స్థితిలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆరోగ్యం బాగుంటే బతికే ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి కావాల్సిందే ఆరోగ్యం. అది ఉంటే దేనినైనా సాధించగలమనే నమ్మకం అనుకోకుండానే పుడుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలు పదునుగా ఉంటాయి, దాని పర్యవసానాలు మెరుగ్గా ఉంటాయి అనేది సహజంగా సామాన్య మానవుడి ఆలోచన విధానం. అందుకే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని నాయకత్వాలు మారినా ప్రజలకు అవసరమైనటువంటి కనీసం మౌలిక సదుపాయాలని, ఆరోగ్య అవసరాలని తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు నడుస్తూ ఉంటాయి. అయితే గత ప్రభుత్వాలతో నాయకత్వాలతో పోల్చుకుంటే ప్రస్తుత సీఎం జగన్ నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సీఎం జగన్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైనటువంటి ఆరోగ్య అవసరాలను తీర్చడంలో గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే పది అడుగులు ముందే ఉంది అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 17 మెడికల్ కాలేజీలకు అంకురార్పణ సీఎం జగన్ ప్రభుత్వం. తద్వారా మరింత మందికి ఉద్యోగావకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా అడుగులు ముందుకేసింది. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను రూపురేఖలు మార్చి నాడు – నేడు ద్వారా మునుపటి కంటే ఉన్నత స్థితిలో సీఎం జగన్ అభివృద్ధి చేశారు. ఎవరు ఊహించని రీతిలో అందులో దాదాపుగా 53,466 పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు, చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. ఇప్పటి వరకు 44.78 లక్షల మందికి ఆరోగ్య శ్రీ ద్వారా రూ.13 వేల కోట్లు విలువైన చికిత్సలు చేయించారు. అనేక రకాలుగా వైద్యరంగంలో సంస్కరణ తీసుకొచ్చి సామాన్య మానవుడికి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని ఆచరణలో చూపిన మార్గదర్శకుడు వైఎస్ జగన్ అని చెప్పొచ్చు .