తనపనేందో తాను చూసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు సంబంధం లేని ఇష్యూ లో లాగి అతని రాజకీయ ప్రస్థానం మొదలు కాకముందే నిర్వీర్యం చేద్దాం అనుకున్నారు. అవ్వలేదు. బలవంతంగా రాజకీయాల్లోకి లాకొచ్చే పరిస్థితి తెచ్చుకున్నారు. తండ్రి చనిపోయాడు కదా ఇక ఆడుకోవచ్చు అనుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి రాజకీయ జీవితం ఆదిలోనే అంతం చేద్దాం అనుకున్నారు. ఫేస్ చేసిన మొదటి జనరల్ ఎలక్షన్స్ లోనే ఆ కాంగ్రెస్ ను భూస్థాపితం చేశాడు..
లక్ష కోట్లు, వేల కోట్లు అంటూ అవినీతి ముద్ర వేసి జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తే వెనక్కి తగ్గుతాడు అనుకున్నారు. కాలమే సమాధానం చెప్తుంది అని ఓపిగ్గా తను అనుకున్న లక్ష్యం వైపు తప్ప మరో వైపు దృష్టి సారించలేదు. 2019 లో అఖండ మెజారిటీ తో ప్రజల మన్ననలు పొంది గెలుపొంది, మీ పార్టీ ని వెంటిలేటర్ మీద పడుకోబెట్టాడు. మేం తప్ప ప్రజలకు దిక్కే లేదు అనుకున్న మీ అహంకారం తాలూకు భావజాలాన్ని ప్రజల ముందు సాష్టాంగపడి అడుక్కునే స్థాయికి తీసుకొచ్చాడు… కత్తితో పొడిచి అడ్డు తొలగిద్దాం అనుకున్నారు, అవ్వలేదు, సీబీఐ ఛార్జ్ షీట్ లో ఎక్కడా తన పేరు లేకున్నా, కనీసం సాక్షిగా తనను పరిగణించని వివేకా హత్యను తన మెడకు చుట్టి అభాసుపాలు చేయాలనుకున్నారు, ప్రజలు నమ్మట్లేదు. ఇంట్లో ఆడబిడ్డలని ఆయన మీదకే ఉసిగొల్పారు, అయినా ఫలితం లేదు.
బయటకు రాడు, పరదాల వెనక ఉంటున్నాడు అన్నారు, ఇప్పుడు బస్సు యాత్ర చేస్తూ నిత్యం జనాల్లో ఉంటుంటే వస్తున్న అశేష ఆదరణను ఓర్వలేక రాళ్లతో కొట్టిస్తున్నారు. అయినా తగ్గడు, తగ్గట్లేదు కూడా. ఎందుకంటే ఆయన నమ్ముకుంది కుట్రలు, కుతంత్రాలను నమ్మని ప్రజలను, వారే అతని బలం, బలగం.
ఒకే ఒక్కరోజు గ్యాప్ తో మళ్లీ జనాల్లోకి వచ్చాడు, జనం నుండి జగన్ ను జగన్ నుండి జనాన్ని వేరు చేయడం మీ తరం కాదు. అందుకు అనేక ఉదాహరణలు మీరే ఇచ్చారు, దానిలో ఒకటర్ ఇవాళ గన్నవరం నియోజకవర్గం లో జగన్ ను చూడటం కోసం ఎగబడ్డ అశేష జనవాహిని.
మీ అమ్ముల పొదిలో ఇక మిగిలున్న ఆఖరి అస్త్రాలన్నీ వాడతారు, వాడండి పర్లేదు. అతను యోధుడు గెలిచే తీరతాడు. వెంటిలేటర్ మీదున్న మీ పార్టీ కి తులసి తీర్థం పోసి జనాల ఓట్లతో నారాయణ మంత్రం చదువుతాడు.