వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రకటించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 50% సీట్లు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీలకే కేటాయిస్తూ ఒక చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ అభ్యర్ధుల ప్రకటనలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసినట్టే మహిళలకి గతంలో కంటే ఎక్కువ అవకాశం కల్పించారు.
సీఎం జగన్ నేడు ప్రకటించిన మొత్తం అభ్యర్ధుల్లో గతంతో పోల్చితే ఐదుగురు మహిళా అభ్యర్ధులు పెరిగారు. 2019లో 19 మంది మహిళా అభ్యర్ధులకి అవకాశం కల్పించిన జగన్ రానున్న ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువగా 24 మంది మహిళా అభ్యర్ధులని ప్రకటించి తాను మహిళా పక్షపాతినని మరో సారి నిరూపించుకున్నారు.
ఈ సంధర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ , మహిళలకు మరింత అవకాశం కల్పించలని తన మనసుకున్నా కొన్ని కారణాల వలన ఈ మాత్రమే పెంచగలిగామని, తన మనసుకు ఇది సంతృప్తిని ఇవ్వలేదని కానీ సమీకరణల దృష్ట్యా తనకి ఇది తప్పలేదని , ఖచ్చితంగా మరో ఎన్నికల్లో ఇప్పటికన్నా మహిళలకి మరింత ఎక్కువ స్థానాలు కేటాయించే విదంగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే జగన్ పరిపాలనలో మహిళలకి ఉన్నత స్థానం కల్పించిన విషయం తెలిసిందే, నామినేటడ్ పోస్టుల్లోను, సంక్షేమ పధకాల్లోను జగన్ మహిళలకి అగ్రస్థానమే కల్పించారు, దానికి కొనసాగింపుగా గతంలో కన్నా నేడు 5 సీట్లు మహిళలకి అధికంగా కేటాయించి తాను మహిళా పక్షపాతినని మరో సారి నిరూపించుకున్నారు జగన్ .