ప్రతి నెల ఒకటో తారీకున కోడి కూయక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ చేతిలో పెట్టే వాలంటీర్ ఎప్పటిలా రాకపోవడంతో పెన్షన్ మీద ఆధారపడి బ్రతికే ఆ ముసలి ప్రాణం ఎదురుచూపులకు పరిమితమైంది. ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నా… వాలంటీర్ ఎంత సేపటికి రాకపోవడంతో, పెన్షన్ మీదే ఆధారపడి బ్రతుకుతూ జీవనం సాగిస్తున్న ఆ వృద్ధుడు ఏం జరిగిందో తెలియక సతమతం అయిపోయాడు. 70 ఏళ్ల వయసు కలిగిన కే.వెంకటరావు అనే పెన్షనర్ వాలంటీర్ ఆలస్యం వెనక అసలు సంగతి తెలియక ఏమై ఉంటుందో అని కంగారు పడిపోయాడు.
అయితే చంద్రబాబు అండ్ కో వాలంటీర్లపై వాలంటరీ వ్యవస్థపై చేసిన కుట్రలు కుతంత్రాలు తెలియని ఆ వృద్ధ పెన్షనర్ అసలు ఎందుకింత ఆలస్యం జరిగింది ఏమయి ఉంటుంది అని తెలుసు కోవడానికి కాళ్లు ఈడ్చుకుంటూ సచివాలయానికి బయలుదేరాడు. ఒకపక్క ఎండ వేడికి తట్టుకోలేక మరొకపక్క ఒంట్లో నిశ్శత్తువ కలగలిపి అచేతనమైన స్థితిలో దారిలోనే కన్నుమూశాడు. ఇదంతా జరిగింది కేవలం చంద్రబాబు నీచ రాజకీయాల వల్ల కుట్రలు కుతంత్రాల వల్ల అనే విషయం సచివాలయానికి బయలుదేరిన ఆ వృద్ధ పెన్షనర్ కి తెలియదు. ఇది ఇలా ఉండగా నిస్సహాయ స్థితిలో వృద్ధుడు మరణించిన విషయం తెలిసిన వెంటనే చలించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన కుటుంబానికి తక్షణమే రూ. 5 లక్షలు మంజూరు చేశారు. కాకినాడ ఎమ్మెల్యే కన్నబాబు స్వయంగా వెళ్లి వెంకటరావు కుటుంబానికి చెక్ అందజేశారు.
అయితే రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటమి భయంతో గత 58 నెలలుగా ప్రతి నెల ఒకటో తారీఖున ఠంచను గా పెన్షన్ అందిస్తున్న వాలంటీర్లను ఉద్దేశపూర్వకంగానే, కేవలం తన స్వార్థపూరిత రాజకీయాల కోసమే వాలంటీర్లను యధావిధిగా వారి విధులకు హాజరుకానివ్వకుండా కావాలనే దూరం చేయాలని కుట్ర పన్ని చంద్రబాబు తన అనూయాయుడైన నిమ్మగడ్డ రమేష్ తో సుప్రీంకోర్టులోను ఢిల్లీ కోర్టులోను అలాగే ఏపీ హైకోర్టులోనూ కేసులు వేయించిన ఫలితమే ఈ పెన్షన్ల ఆలస్యానికి అసలు కారణం అని మనకి తెలిసిందే.. ఇది ఇలాగే కొనసాగితే చంద్రబాబు నీచ రాజకీయ కుట్రల వల్ల ఎంతమంది ఆధారం లేని అవ్వ తాతల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో!