మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్ ను తీవ్ర ఆరోగ్య సమస్యతో భాదపడుతున్న యువకుడి కుటుంబం కలిశారు, ఏదైనా ఆరోగ్య సమస్యతో తన దగ్గరకి వస్తే చలించిపోయే జగన్ గారు ఆ యువకుడికి నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ,అదే ఉదారతను, మానవత్వాన్ని చాటుకున్నారు
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా సదుం మండలం సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల క్రితం పెరాలసిస్కు గురయ్యాడు. ఇప్పటికే స్తోమతకు మించి, అప్పుల చేసి మరీ వైద్యం చేయించింది ముఖేష్ కుటుంబం.అంతంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారికి ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి. అతని వైద్యానికి మరో 15 లక్షలు అవసరం అవుతాయని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
సీఎం వైఎస్ జగన్ను కలిస్తే తప్పక తమకు సహాయం దొరుకుతుందని భావించి మేమంతా సిద్ధం యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిసారు. సీఎం వైఎస్ జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకుని అతడి ఆరోగ్య పరిస్థితిని గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ముఖేష్ వివరాలను తీసుకోవాలని ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం జరిగి మామూలు మనిషి అవుతాడనే నమ్మకం కలిగిందని, సీఎం జగన్ గారు కల్పించిన భరోసా మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది ఆ కుటుంబ తెలిపింది