మేనిఫెస్టోని పవిత్ర గ్రంథాలైన బైబిల్, ఖురాన్, భగవద్గీతతో పోలుస్తూ దానికి వన్నె తెచ్చిన నాయకుడు ఒకరైతే, మేనిఫెస్టోలో అర్థం పర్థం లేని హామిలిచ్చి ఆఖరికి ఆ మేనిఫెస్టోని పార్టీ వెబ్సైట్ నుండి మాయం చేసిన ఘనుడు మరొకరు. మీకు ఆ ఇద్దరు నాయకులు అర్ధమయ్యే ఉంటారు.. ఒకరు సీఎం జగన్ అయితే మరొకరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
2014 ఎన్నికల్లో అధికారం కోసం ఎన్నెన్నో హామిలను మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను ప్రజలు మేనిఫెస్టోలో చూసి ప్రశ్నిస్తారని పార్టీ వెబ్సైట్ నుండి మాయం చేసాడు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ అంటూ అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక రైతులకు, డ్వాక్రా మహిళలకు మొండిచెయ్యి చూపాడు. గ్రాఫిక్స్ మాయాజాలంతో ఐదేళ్లు కాలం గడిపిన బాబు ఒక్క గుర్తు పెట్టుకునే పథకం కూడా అమలుపరచలేదు..
చంద్రబాబు ధోరణికి భిన్నంగా జగన్ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో పోలుస్తూ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేసాడు. తన మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి మేనిఫెస్టో పట్ల తనకున్న చిత్తశుద్ధిని నిబద్ధతను చాటుకున్నారు. మేనిఫెస్టోలో ప్రతీ హామీని అమలుచేయడానికి శాయశక్తులా కృషి చేసిన సీఎం జగన్ కి, మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చేందుకు కనీసం ప్రయత్నం చేయకుండా మేనిఫెస్టోనే మాయం చేసిన చంద్రబాబుకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
చంద్రబాబు తనిచ్చిన హామీలను నెరవేర్చకుండా మేనిఫెస్టోను మాయం చేసి ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోతే సీఎం జగన్ మాత్రం తాను హామీ ఇచ్చిన నవరత్నాలను సమర్ధవంతంగా అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని మూటగట్టుకుని జన హృదయాలను గెలుచుకున్నారు..