పొత్తులో భాగం గా 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాల నుండి బీజేపీ పోటీ చేయబోయే అభ్యర్థులను ఆ పార్టీ ఖరారు చేయడం తో టికెట్ రాని బిజెపిసాంప్రదాయ నేతలు గుర్రుగా ఉన్న సంగతి తెల్సిందే ఇదే విషయం పై విశాఖ జిల్లా పదాధికారుల సమావేశం లో వాడివేడిగా వాదనలు నడిచాయి…కడపకు చెందిన సీఎం రమేష్ కు, అలాగే ఈ ప్రాంతం కు సంబంధం లేని ఈశ్వరరావుకు సీట్లు ఇవ్వడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు..
ఉత్తరాంధ్ర లో అంతగా లేని వెలమ, కమ్మ సామాజిక వర్గాలకు ఉత్తరాంధ్రలో సీట్లు ఎలా ఇస్తారని ఉత్తరాంధ్ర ప్రాంత బీజేపీ నేతలు నిలదీశారు..
పార్టీ కోసం ఎప్పటి నుండో నిలబడ్డ పక్కా బీజేపీ వారైన జీవీఎల్ ,సోము వీర్రాజు, మాధవ్ కు సీట్లు ఇవ్వకపోవడం ఏమిటని, వలసవాదులకు, బీజేపీ భావజాలం పై కనీస అవగాహన లేని వారికి టికెట్ లు దక్కడం సరైనది కాదని వారు ఆవేదన వ్యక్తం చేసారు..అలాగే 10 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లలో కనీసం ఒక్క సీటు కూడా కాపు సామాజిక వర్గానికి ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని, దీనంతటికీ కారణం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నే, పురందేశ్వరి తీరువల్లే పార్టీ భ్రష్టపట్టిందని పలువురు బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు.
బాబుకు లబ్ధి చేకూర్చేలా తన సామాజిక వర్గానికి చెందిన బాబు అనుయాయులకు టికెట్ లు ఇచ్చారని, ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో నాలుగో వంతు కమ్మ సామాజిక వర్గానికే ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నించారు. కాబట్టి ఇలాంటి విపరీత పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేయలేమని, ఎన్నికల ప్రచారానికి వెళ్లలేమని బీజేపీ అగ్రనేతలైన అరుణ్ సింగ్ మరియు మధుకర్ జీవీ లకు నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు..