చంద్రబాబు, పురందేశ్వరి పెట్టిన పితలాటకంతో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి కళా వెంకటరావును ఎంపిక చేశారు చంద్రబాబు. అయితే అక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో టికెట్పై ఆశలు పెట్టుకున్న కళా సోదరుడి కుమారుడైన కిమిడి నాగార్జునకి తన అలవాటు అయిన తనకూ మత్రమే సాధ్యం అయిన వెన్నుపోటు పోడిచారు.
కిమిడి నాగార్జున తల్లి కిమిడి మృణాళిని 2014లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండేళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న నాగార్జున రాజకీయాలపై ఆసక్తితో విదేశాల్లో ఉద్యోగం వదులుకొని వచ్చి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా, చీపురుపల్లిలో ఐదేళ్లుగా పార్టీ అభివృధి కోసం కృషి చేస్తు అటూ బొత్య సత్యనారాయన లాంటి సినియార్ నాయకుడితో పోరాటం చేస్తు వచ్చారు చివరికి ఎలక్షన్ వచ్చే సరికి కరివేపాకులా తీసిపారేసి ఆఖరికి కుటుంభంలో చిచ్చు రగిల్చేలా సొంత బందువు అయిన కళా వెంకటరావుకి ఇచ్చారు.
2019లో ఓడిపోయినప్పటికి నాగార్జున పార్టీ కి చేసిన పనులు , తన పనితీరు గమనించి నాగార్జునకు మంచి భవిష్యత్ ఉందని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు టీడీపీ అధినేత చంద్రాబునాయుడు. అప్పటి నుండి అటూ జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడంలో కష్టపడి పని చేశారు. ఇప్పడు తీరా ఎన్నికలు వచ్చే సరికి నాగార్జున పనికిరాడంటూ చంద్రబాబు ముద్ర వేసి కిమిడి కళా వెంకట్రావు కు టికెట్ ఇచ్చి తన రాజకీయ భవిష్యత్ కు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కిమిడి నాగార్జున అనుచరులు తమ నాయకుడికి జరిగిన అన్యాయం మీద తిరుగుబాటు మొదలు పెట్టారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే టీడీపీ కి సహకరించే పరిస్థితి లేదు అని ఖరఖండిగా చెబుతున్నారు.
ఈ గొడవల నేపథ్యం లో టీడీపీ కి డిపాజిట్ లు కూడా రావు అంటున్నారు రాజకీయా పరిశీలకులు.