ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకి మారిపోతూ కుటుంబ సభ్యుల మధ్యనే తీవ్ర విభేదాలు సృష్టిస్తున్నాయి. అమలాపురం నియోజకవర్గంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలతో ముఖ్య నాయకులు వరుసగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురం ఇక్కడ తన అభ్యర్థి శ్యామ్ కుమార్ 2009 నుండి టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంటే అతన్ని కాదు అని పార్టీ ఆనంద కుమార్ కు అవకాశం కల్పించారు. దీనితో పార్టీ టికెట్ వస్తుందని పార్టీలో కష్టపడటంతో పాటు ఆర్థికంగా బాగా ఖర్చు చేసిన శ్యామ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. నిమ్మకాయల చినరాజప్ప తరుపున నియోజకవర్గంలో వ్యవహారాలు అన్నీ చక్కబెట్టే చినరాజప్ప తమ్ముడు నిమ్మకాయల జగ్గయ్య నాయుడు జరుగుతున్న వ్యవహారాలు చూసి మనస్థాపం చెంది శ్యామ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటిలో నిలబడ్డానికి అన్న కారణం తప్ప నేను కాదు అని గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు.
అలాగే అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలనికి చెందిన కీలక నాయకుడు అడపా కృష్ణ టీడీపీ రాజీనామా చేసి శ్యామ్ కుమార్ పక్కన చేరడంతో అమలాపురం టీడీపీని రెండుగా చీల్చి నిమ్మకాయల సోదరులు ఇద్దరు కలిసి స్వతంత్ర అభ్యర్థి శ్యామ్ కు తమ సహాయ సహకారాలు అందజేస్తున్నారని టీడీపీ నేతలు కార్యకర్తలు కోడై కూస్తున్నారు. అదే సమయంలో ఆనంద్ కుమార్ తన అన్న నిమ్మకాయల చినరాజప్ప ఎడమొఖం పెడ మొఖంగా ఉండే సరికి పరిస్థితులు గమనించి తన తప్పు లేకపోయినా అన్న వలన తన మీద వస్తున్న ఆరోపణల వల్ల మనస్థాపం చెంది ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా జరుగుతున్న అని ప్రకటించారు.
రాష్ట్రంలో అన్ని చోట్ల టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రచారం లో ముందుకు వెళ్తుంటే అమలాపురంలో మాత్రం రోజుకో కీలక నాయకుడి రాజీనామాలతో తిరోగమనంలో పోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.