చంద్రబాబు శనివారం తొలి జాబితా విడుదల చేశారు. ఇందులో ఉదయగిరి సీటును కాకర్ల సురేష్ అనే వ్యక్తికి ఖరారు చేశారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి బొల్లినేని రామారావుకే హ్యాండ్ ఇచ్చారు. ఈయన మహారాష్ట్రలో కాంట్రాక్టర్గా ఉన్నారు.
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బాగా చూసుకుంటారని నమ్మి వెళ్లిన ఎమ్మెల్యేలు ఇప్పుడు పోయాం మోసం రాగం అందుకున్నారు. వారిలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఒకరు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి మరలా ఉంది.
చంద్రబాబు శనివారం తొలి జాబితా విడుదల చేశారు. ఇందులో ఉదయగిరి సీటును కాకర్ల సురేష్ అనే వ్యక్తికి ఖరారు చేశారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి బొల్లినేని రామారావుకే హ్యాండ్ ఇచ్చారు. ఈయన మహారాష్ట్రలో కాంట్రాక్టర్గా ఉన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అండదండలు ఉన్నాయని, బాబు స్కిల్డెవలప్మెంట్ కేసు సమయంలో కమలం పెద్దలతో లోకేశ్ మాట్లాడేందుకు సాయం చేశానని చెప్పేవాడు. అలాంటి వ్యక్తిని నారా వారు బయటికి తోసేశారు. ఇక చంద్రశేఖర్రెడ్డి ఎంత. ఈయనకు వైఎస్సార్ కాంగ్రెస్లో జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. 2014లో ఓడిపోయినా 2019లో మళ్లీ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేని చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబుకు అమ్ముడుపోవడంతో వైఎస్సార్సీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. దీంతో టీడీపీలో చేరారు. ఉదయగిరి టికెట్ కావాలని లోకేశ్ చుట్టూ తిరిగారు. పేపర్లలో భజన యాడ్స్ ఇచ్చారు. కానీ చంద్రశేఖర్రెడ్డిని పేరును అసలు పరిగణలోకి కూడా తీసుకోకపోవడంతో ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే.
తాడికొండ సీటును తెనాలి శ్రావణ్ కుమార్కు ఇచ్చారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి భంగపాటు తప్పలేదు. ఈమెను జగన్ శాసనసభ్యురాలిని చేశారు. అయితే తెలుగుదేశానికి అమ్ముడుపోయారు. వైఎస్సార్సీపీ సస్పెండ్ చేశాక చంద్రబాబు గూటికి చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు చెప్పినట్లు చేశా కాబట్టి తాడికొండ సీటు ఇచ్చేస్తారని భావించారు. కానీ నారా వారు చివరికి తన మార్క్ చూపించారు. దీంతో శ్రీదేవి తప్పు చేశానని తల పట్టుకున్నారు. ఈమె రాజకీయ జీవితం కూడా బాబు పుణ్యనా ముగిసినట్లే.
ఆనం రామనారాయణరెడ్డి.. నెల్లూరులో సీనియర్ నాయకుడు. అనేక పార్టీలు తిరిగారు. ఈయన రాజకీయ జీవితం ముగిసిపోయిందని అందరూ అనుకున్న తరుణంలో జగన్ 2019లో వెంకటగిరి సీటు ఇచ్చి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. అయితే మంత్రి పదవి ఇవ్వలేదని అలిగిన ఆనం చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ లైన్ దాటడంతో సస్పెన్షన్ వేటు పడింది. తర్వాత పూర్తిగా టీడీపీలో చేరిపోయారు. జగన్, ఆయన ప్రభుత్వాన్ని తిడుతున్నా కాబట్టి తాను ఏమి అడిగినా బాబు ఇచ్చేస్తారని భావించారు. ఈ నేపథ్యంలో కుమార్తెకు ఆత్మకూరు, తనకు నెల్లూరు సిటీ సీట్లు అడిగారు. అయితే నారా వారు నో చెప్పారు. ఆత్మకూరుకే పరిమితం కావాలన్నారు. జిల్లాలో పొంగూరు నారాయణ కింద పనిచేయడం ఇష్టం లేక వెంకటగిరి సీటు కోసం పట్టుబట్టారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల దీనికి ఒప్పుకోలేదు. ఆనంకు ఇస్తే ఓడిస్తామని చెప్పారు. దీంతో బాబు ఆత్మకూరు, వెంకటగిరి సీట్లను ప్రకటించలేదు. సీనియర్ పొలిటీషియన్ అని విర్రవీగిన రామనారాయణరెడ్డి తొలిజాబితాలో పేరు లేకపోవడంతో షాక్ తిన్నారు. ఇప్పుడు వీరంతా విజనరీని నమ్మి నిండా మునిగిపోయామని బాధపడుతున్నారు.