నాలుగుసార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక తెలుగుదేశం నాయకులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి పైకి గెలుపు తమదేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. అడ్డదారులు తొక్కుతున్నారు. ఆయన అండతో శ్రేణులు చీప్ ట్రిక్స్కు దిగాయి.
2019లో రామకృష్ణారెడ్డికి 1,10,406 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డికి 88,488 ఓట్లు వచ్చాయి. పిన్నెల్లి 21,918 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ టీడీపీ నాయకులు వికీపీడియాలో ఈ మెజార్టీ సంఖ్యను ఎడిట్ చేసి తక్కువగా చూపించి శునకానందం పొందుతున్నారు. అంజిరెడ్డికి 1,08,888 ఓట్లు పోలైనట్లు పెట్టారు. మెజార్టీని 7,518గా మార్చారు. కానీ వారు చేసిన తప్పు ఇక్కడే బయటపడింది. 1,518 సంఖ్య బదులు 7,518 వేసి దొరికిపోయారు. ఇంకా పోలైన ఓట్ల శాతాన్ని కూడా మార్చి అభాసుపాలయ్యారు.
బుర్రలేని తెలుగు తమ్ముళ్లు పొరపాటు ఎవరికైనా ఇట్టే తెలిసిపోతోంది. పిన్నెల్లికి 52.5 శాతం ఓట్లు పోలయ్యాయి. కాగా 50.1 శాతం టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డికి వచ్చినట్లు మార్చారు. ఈ లెక్కన 102.6 శాతం ఇద్దరికీ వచ్చినట్లు. ఇలా జరిగితే ఎన్నికను రద్దు చేస్తారనే ఆలోచన కూడా చేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డంగా దొరికిపోయాయి.
పిన్నెల్లి 2019లో ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు నల్లేరుపై నడకే.. దీంతో బ్రహ్మానందరెడ్డి మనుషులు ఆందోళన చెందుతూ పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నారు. గత ఎన్నికల మెజార్టీని తక్కువ చేసి చూపించి.. ఈసారి మనం గెలిచేస్తున్నామని కార్యకర్తల్ని భ్రమలో ఉంచేందుకు ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేశారు. పోనీ అంతా కరెక్ట్గా చేశారా అంటే లేదు. సగం సగం పనులతో నవ్వులపాలయ్యారు.